News March 12, 2025
NLG: GGHలో భద్రత డొల్ల!…

NLG ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత కరువైందని రోగులు అంటున్నారు. ఆసుపత్రికి నిత్యం 1,500 మంది అవుట్ పేషెంట్లు, సుమారు 600 వరకు ఇన్ పేషెంట్లు వస్తుంటారన్నారు. పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నా GGHలో భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నట్లు చెబుతున్నారు. కాగా ఇటీవల బాలుడి కిడ్నాప్ ఉందంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Similar News
News January 24, 2026
చిట్యాల: లారీ నడుపుతూ గుండెపోటుతో మృతి

లారీ నడుపుతుండగానే గుండెపోటు రావడంతో ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకకు చెందిన ఎండీ నాసిర్ (61) ముంబై నుంచి విశాఖపట్నంకు లారీలో వెళ్తుండగా.. చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద ఛాతీనొప్పి రావడంతో లారీని పక్కకు ఆపారు. స్థానికులు 108కి సమాచారం అందించగా, సిబ్బంది వచ్చేలోపే ఆయన మృతి చెందారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 24, 2026
NLG: ఎన్నికలకు యంత్రాంగం సర్వం సిద్ధం!

మున్సిపాలిటీలు, కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వంసిద్ధమవుతోంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఆ దిశగా అధికారుల సమాయత్తం అవుతున్నారు. జిల్లాలోని NLG కార్పొరేషన్, MLG, HLY, నందికొండ, DVK, CDR, CTL మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి మార్గదర్శకాల పుస్తకాలను మున్సిపల్ సిబ్బంది హైదరాబాద్ నుంచి తీసుకువచ్చారు.
News January 24, 2026
ఏటేటా పడిపోతున్న కూరగాయల సాగు

జిల్లాలో కూరగాయ పంటలు, ఆకు కూరల సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతుంది. NLG నగరం మూడువైపులా శరవేగంగా విస్తరిస్తుండడం, వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతుండడం, మరోవైపు ప్రభుత్వపరంగా ఉద్యాన రైతులకు సహాయ సహకారాలు కొరవడటంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. దశాబ్ద కాలం క్రితం జిల్లాలో వందల ఎకరాలకుపైబడి విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయ పంటలు సాగయ్యేవి. ఇప్పుడు 30 శాతం కూడా సాగు చేయడం లేదు.


