News March 16, 2024
NLG: గ్రామీణ మహిళలకు గుడ్ న్యూస్

స్టేట్ బ్యాంకు ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ గ్రామీణ మహిళలకు బ్యూటీ పార్లర్లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణను భోజన వసతి సౌకర్యములతో ప్రారంభిస్తున్నట్లు SBI-RSETI డైరెక్టర్ రఘుపతి తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండి 10వతరగతి పాసైన నిరుద్యోగ గ్రామీణ మహిళలు ఈనెల 25 లోపు SBI-RSETI, రాంనగర్, నల్గొండలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Similar News
News April 7, 2026
NLG: ప్రశాంతంగా జీవశాస్త్రం పరీక్ష.. 41 మంది గైర్హాజరు

జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన జీవశాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ బిక్షపతి తెలిపారు. మొత్తం 106 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు సాధారణ విద్యార్థులు 19,698 మందికి గానూ 19,663 మంది హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 103 మందికి గానూ 97 మంది రాశారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 41 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన వివరించారు.
News April 7, 2026
NLG: యాచారంలో ఆయిల్పామ్ ప్రాసెసింగ్ యూనిట్

అనుముల మండలం యాచారంలో ఆయిల్పామ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 14 వేల ఎకరాల్లో సాగు ఉండగా, ప్రస్తుతం 2,500 ఎకరాల్లో పంట కోత దశకు చేరింది. రైతులకు రవాణా ఖర్చులు తగ్గించి, ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ మిల్లును నిర్మిస్తున్నారు. ప్రాథమికంగా గంటకు 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభించి, భవిష్యత్తులో దీనిని 120 టన్నులకు విస్తరించనున్నారు.
News April 7, 2026
‘పారాక్వాట్’ విక్రయిస్తే కఠిన చర్యలు: నల్గొండ DAO

అత్యంత ప్రమాదకరమైన ‘పారాక్వాట్’ గడ్డిమందు విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిషేధం విధించిందని నల్గొండ DAO శ్రావణ్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో 24ను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ మందు వాడకం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా, పండే కూరగాయలు సైతం విషపూరితంగా మారి ప్రజల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతాయని ఆయన హెచ్చరించారు. ఎవరైనా విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.


