News March 16, 2024
NLG: గ్రామీణ మహిళలకు గుడ్ న్యూస్

స్టేట్ బ్యాంకు ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ గ్రామీణ మహిళలకు బ్యూటీ పార్లర్లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణను భోజన వసతి సౌకర్యములతో ప్రారంభిస్తున్నట్లు SBI-RSETI డైరెక్టర్ రఘుపతి తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండి 10వతరగతి పాసైన నిరుద్యోగ గ్రామీణ మహిళలు ఈనెల 25 లోపు SBI-RSETI, రాంనగర్, నల్గొండలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Similar News
News August 15, 2025
NLG: జిల్లాలో 40.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

జిల్లా వ్యాప్తంగా గురువారం 40.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. పత్తి, పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. అత్యధికంగా చందంపేటలో 82.9, MLGలో 75.9, పీఏ పల్లిలో 74.9, DVKలో 68.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా చిట్యాలలో 11.4 మీమీ వర్షం కురిసింది.
News August 14, 2025
30న MGU డిగ్రీ 6వ సెమిస్టర్ ఇన్స్టంట్ పరీక్ష

MGU పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్లో కేవలం ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఇన్స్టంట్ అవకాశాన్ని అందిపుచ్చుకొని దరఖాస్తు చేసుకున్న వారికి 30 ఆగస్టు 2025 నుండి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. కేవలం ఒకే సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
News August 14, 2025
సీఎంకు రేవంత్కు గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ

‘మన ఊరు-మన బడి’ పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రూ.361.350 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా మంజూరు చేయాలని ఆయన లేఖలో కోరారు.