News March 25, 2025
NLG: SLBC ఘటన.. మృతుడు ఇతడే!

SLBC టన్నెల్లో గత నెల 22న జరిగిన దుర్ఘటనలో ఎనిమిది మంది చిక్కుకోగా అందులో <<15882600>>ఈరోజు లభ్యమైన మృతదేహం<<>> UPలోని సఫీపురఉన్నా జిల్లా బంగర్మావు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ (51)గా తెలిసింది. ఈయన కొన్నేళ్లుగా జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News December 5, 2025
నల్గొండ: ఎన్నికల వేళ.. జోరందుకున్న దావత్లు!

గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. గురువారం నుంచి మొదటి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బరిలో ఉన్న అభ్యర్థులు విందు, వినోదాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో మటన్ కిలో రూ.800 నుంచి రూ.1,000 ధర పలుకుతుండడంతో చికెన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. కిలో చికెన్ రూ.220, స్కిన్ లెస్ కిలో రూ.250 పలుకుతోంది. లిక్కర్ అమ్మకాలూ విపరీతంగా పెరిగాయి.
News December 5, 2025
BREAKING: నల్గొండ: లంచం తీసుకుంటూ దొరికిన డిప్యూటీ MRO

లంచం తీసుకుంటూ ఓ డిప్యూటీ తహశీల్దార్ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా చండూరు తహశీల్దార్ ఆఫీస్లో డిప్యూటీ MRO రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు ఆయనను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 5, 2025
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ జానకి షర్మిల

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం డిసెంబర్ 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా పబ్లిక్ మీటింగ్లు, ర్యాలీలు, ధర్నాలు నిషేధమని స్పష్టం చేశారు. అలాగే ఆయుధాలు, పేలుడు పదార్థాలు, లౌడ్ స్పీకర్లు, డీజేలు వినియోగించడం కూడా నిషేధమని చెప్పారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.


