News March 18, 2024

NLG: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. సెంటర్ల వద్ద 144 సెక్షన్‌

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి నుంటి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 109 పరీక్ష కేంద్రాల్లో 19,715 మంది, సూర్యాపేటలోని 76 సెంటర్లలో 12,133 మంది, యాదాద్రిలో 51 సెంటర్లలో 9130 మంది పరీక్ష రాయనున్నారు. దీంతో సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ అమలుతోపాటు పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని డీఈఓ బిక్షపతి సూచించారు.

Similar News

News August 15, 2025

NLG: జిల్లాలో 40.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

జిల్లా వ్యాప్తంగా గురువారం 40.1 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. పత్తి, పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. అత్యధికంగా చందంపేటలో 82.9, MLGలో 75.9, పీఏ పల్లిలో 74.9, DVKలో 68.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా చిట్యాలలో 11.4 మీమీ వర్షం కురిసింది.

News August 14, 2025

30న MGU డిగ్రీ 6వ సెమిస్టర్ ఇన్స్టంట్ పరీక్ష

image

MGU పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్‌లో కేవలం ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఇన్స్టంట్ అవకాశాన్ని అందిపుచ్చుకొని దరఖాస్తు చేసుకున్న వారికి 30 ఆగస్టు 2025 నుండి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. కేవలం ఒకే సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

News August 14, 2025

సీఎంకు రేవంత్‌కు గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ

image

‘మన ఊరు-మన బడి’ పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రూ.361.350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా మంజూరు చేయాలని ఆయన లేఖలో కోరారు.