News April 12, 2025
NLG: ఆస్తికోసం కూతురిని చంపిన సవతి తల్లి

ఆస్తికోసం కూతురిని పినతల్లి చంపిన ఘటన గతేడాది DEC 7న జరగ్గా పోలీసులు ఈ కేసును ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. కూతురిని సవతితల్లి హతమార్చి వంగమర్తి వాగులో మృతదేహాన్ని పూడ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో మేడిపల్లి PSలో మిస్సింగ్ కేసు నమోదైంది. మహేశ్వరి మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు.
Similar News
News December 18, 2025
311 పోస్టులకు నోటిఫికేషన్

రైల్వేలో 311 ఉద్యోగాల భర్తీకి RRB షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, జూ.ట్రాన్స్లేటర్, స్టాఫ్&వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ తదితర ఖాళీలున్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, PG(హిందీ&ఇంగ్లిష్), డిగ్రీ పాసై, వయసు 18-40 ఏళ్లు ఉండాలి. DEC 30 నుంచి JAN 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుంది.
వెబ్సైట్: rrbcdg.gov.in/
News December 18, 2025
ఏలూరు జిల్లా యువతకు ఉచిత శిక్షణ

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు DLTC ప్రధానాచార్యుడు డి.భూషణం గురువారం తెలిపారు. (PMKVY 4.O) కింద ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ & పెరిఫెరల్స్ (కంప్యూటర్ హార్డ్వేర్) కోర్స్లో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇంటర్ అంత కంటే ఎక్కువ ఉత్తీర్ణులైన వారు, 15 నుంచి 35 ఏళ్ల లోపు వారు ఈనెల 30లోగా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News December 18, 2025
తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు ఎందుకు?

సాధారణంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏడాదికి ఒకసారే జరుగుతాయి. అయితే ప్రతి మూడేళ్లకోసారి చాంద్రమానం ప్రకారం అధికమాసం వచ్చినప్పుడు 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భాద్రపద మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అదనంగా నిర్వహిస్తారు. ఆ వెంటనే దసరా నవరాత్రుల్లో, ఆశ్వయుజ మాసంలో రెండోసారి ఉత్సవాలు చేస్తారు. అయితే, రెండో ఉత్సవంలో ధ్వజారోహణం, ధ్వజావరోహణం వేడుకలు ఉండవు. <<-se>>#VINAROBHAGYAMU<<>>


