News March 27, 2024
NLG: లక్షలు ఖర్చు చేస్తున్నా.. అందని వైద్యం!

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని మాదిరిగా తయారైంది NLG జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి తీరు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో శస్త్ర చికిత్సలు స్థానికంగా ఉండే జనరల్ ఆస్పత్రుల్లోనే జరగాలని ప్రభుత్వం రూ. లక్షలు ఖర్చు చేసి పరికరాలను ఏర్పాటు చేసింది. కానీ NLG ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాళ్ళ చిప్పల మార్పిడి లాంటి శస్త్ర చికిత్సలను వైద్యులు పక్కన పెట్టారు. దీంతో బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు.
Similar News
News December 18, 2025
రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ధాన్యం కొనుగోలు వివరాలను రికార్డుల్లో పక్కాగా నమోదు చేయాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి కేంద్రాల నిర్వాహకులను హెచ్చరించారు. గురువారం ఆమె అనుముల మండలం కొత్తపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా చేశారు. రిజిస్టర్లు, ధాన్యం తేమ శాతం, తూకం వేసిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు లోడ్ చేయాలని ఆదేశించారు.
News December 18, 2025
NLG: ముగిసిన పల్లె సంగ్రామం

నల్గొండ జిల్లాలో గ్రామీణ సంగ్రామం ముగిసింది. నెల రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ నిన్నటితో పరిసమాప్తం అయింది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సహకరించిన వారందరికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ధన్యవాదాలు తెలిపారు.
News December 18, 2025
పీఏ పల్లి: మానవత్వం చాటుకున్న ఎస్సై విజయ బాయి

మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పీఏ పల్లి మండలం అంకంపేట, అంగడిపేటలో విధులు నిర్వహించిన మహిళా ఎస్సై విజయబాయి మానవత్వం చాటుకున్నారు. ఓటు వేయడానికి వచ్చిన వికలాంగులు, వయోవృద్ధులను వీల్ చైర్లో కూర్చోబెట్టి స్వయంగా పోలింగ్ రూమ్ వద్దకు తీసుకెళ్లింది. నిధి నిర్వహణలో ఉండి కూడా వృద్ధులు, వికలాంగులకు చేయూతనివ్వడం పట్ల పలువురు ఎస్సై విజయ బాయిని అభినందించారు.


