News April 17, 2025
NLG: వివాహితపై హత్యాయత్నం.. 20ఏళ్లు జైలు

వివాహితపై యాసిడ్తో దాడి చేసిన వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ NLG జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. నాంపల్లి(M) దామెర వాసి మహేశ్ గిరిజన మహిళను తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తూ 2018లో ఆమెపై యాసిడ్ దాడికి యత్నించాడు. ఆమె నాంపల్లి PSలో ఫిర్యాదు చేయగా అప్పటి SI కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. జడ్జి రోజారమణి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
Similar News
News April 20, 2025
IPL: CSK ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే?

CSK ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడి కేవలం రెండింట్లోనే గెలిచింది. దీంతో ప్లేఆఫ్స్కు చేరాలంటే మిగిలిన 7 మ్యాచుల్లో కచ్చితంగా 6 గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ 5 గెలిస్తే నెట్ రన్రేట్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉండాలి. ప్రస్తుతం ధోనీ సేన NRR -1.276గా ఉంది. ఇది మెరుగవ్వాలంటే భారీ తేడాలతో మ్యాచులు గెలవాలి. CSK ప్లేఆఫ్స్కు చేరుతుందని అనుకుంటున్నారా? మీ కామెంట్.
News April 20, 2025
‘ఎమ్మెల్యే’ మూవీలో నటిస్తున్న నరసరావుపేట MLA

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు టైటిల్ రోల్లో ‘ఎమ్మెల్యే’ సినిమా రూపొందిస్తున్నామని సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఇందుకోసం సత్తెనపల్లి మండల పరిధిలోని దూళిపాళ్ల గ్రామ శివారులో శనివారం సినిమా చిత్రీకరణ కోసం లోకేషన్లను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో దిలీప్ రాజా మాట్లాడుతూ త్వరలో షూటింగ్ మొదలుపెడతామన్నారు.
News April 20, 2025
భారీగా పడిపోయిన ‘దొండ’ రేటు!

<<16113156>>ఉల్లి,<<>> టమాటా తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లో దొండకాయల ధర భారీగా పడిపోయింది. ఇటీవల 10 కిలోల దొండ ధర రూ.300-325 పలకగా ప్రస్తుతం రూ.150-50కి పడిపోయింది. ఎకరా విస్తీర్ణంలో సాగుకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. కొన్నిచోట్ల వ్యాపారులు కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తుండటంతో పెట్టుబడి ఖర్చులూ రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. అయితే బహిరంగ మార్కెట్లలో కిలో రేటు రూ.20-30 వరకు ఉండటం గమనార్హం.