News April 12, 2025
NLR: అమ్మోనియం లీక్.. 10మందికి అస్వస్థత

నెల్లూరు జిల్లాలో అమ్మోనియం గ్యాస్ లీక్ కలకలం రేపింది. తోటపల్లి గూడూరు మండలం అనంతవరంలోని ఓ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో సుమారు పదిమంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్రామంలోనూ గ్యాస్ వ్యాపించడంతో స్థానికులు మాస్కులు ధరించారు. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Similar News
News April 10, 2026
వరల్డ్ టాప్-2%లో నెల్లూరు శాస్త్రవేత్త

ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా ఐదోసారి నెల్లూరు శాస్త్రవేత్త డాక్టర్ అనుముకొండ వరదరాజులు చోటు సంపాదించారు. ఆయనను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సత్కరించారు. 75 ఏళ్ల వయసులో పసుపు, గోమూత్రం వంటి ప్రకృతి సిద్ధ పదార్థాలతో క్యాన్సర్ కణాలను నిరోధించే ‘నానో-మెడిసిన్’పై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఆయన సాధించిన అంతర్జాతీయ పేటెంట్లు జిల్లాకు గర్వకారణమని జేసీ కొనియాడారు.
News April 10, 2026
నెల్లూరు: 12న మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ టెస్ట్

నెల్లూరు జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలకు ఈనెల 12న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీఈవో బాలాజీరావు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే పరీక్షకు హాజరుకావాలన్నారు. www.apms. apcfss.in నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
News April 10, 2026
నెల్లూరు జిల్లాలో 30 ఏళ్లుగా ఎదురుచూపులు!

రాపూరు(M) కండలేరు జలాశయం నిర్మాణానికి భూములు ఇచ్చిన 19 గ్రామాల ప్రజలు 30 ఏళ్లుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారు. వేల ఎకరాల భూములతో పాటు విలువైన పండ్ల తోటలను కోల్పోయారు. ఇందులో కొంతమందికే ఇళ్లు కేటాయించారు. 117 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చినప్పటికీ మరో 60 కుటుంబాలకు ఇప్పటికీ కాలనీ ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వాలు మారడంతో పనులు ఆలస్యమవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


