News April 3, 2025
NLR: గుంతలో పడి మృతి.. భారీ ఫైన్ వేసిన కోర్టు

అధికారుల నిర్లక్ష్యంతో చనిపోయిన టీచర్ కుటుంబానికి భారీ పరిహారం అందింది. విడవలూరు(M) రామతీర్థం స్కూల్ పీఈటీ దాసరి కామరాజ్ 2016 మే27న బైకుపై నెల్లూరుకు వెళ్లాడు. తిరిగొస్తుండగా గుండాలమ్మపాలెం వద్ద గుంతలో పడి చనిపోయారు. అక్కడ హెచ్చరిక బోర్డు లేకపోవడంతో చనిపోయారని బంధువులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. కామరాజ్కు ఇంకా 12ఏళ్ల సర్వీస్ ఉండటంతో రూ.1.30కోట్లు చెల్లించాలని R&B శాఖను కోర్టు ఆదేశించింది.
Similar News
News February 26, 2026
నెల్లూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్తో ఒకరి మృతి?

నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం నాగులవరానికి చెందిన టీడీపీ నాయకుడు(47) చనిపోయారు. కావలిలో నివాసం ఉండే ఆయన వారం కిందట పొలం పనులకు వెళ్లినప్పుడు కాలికి ఏదో కుట్టినట్లు అనిపించింది. తర్వాత జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. ఎంతకి తగ్గకపోవడంతో చెన్నైకి తీసుకెళ్లారు. ఈనెల 24వ తేదీ చనిపోయారు. స్క్రబ్ టైఫస్తో మరణించినట్లు డాక్టర్లు రిపోర్టు ఇచ్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
News February 26, 2026
నెల్లూరు: మీ ఏరియాలో పాలు బాగుంటాయా?

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పలువురు చనిపోయారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. పాల నాణ్యతను నిర్ధారించేందుకు మాజిక్ బాక్స్ అందుబాటులోకి వచ్చింది. దీంతో అక్కడికక్కడే పాల కల్తీని గుర్తిస్తున్నారు. జిల్లాలో100 వరకు డెయిరీలు ఉండగా.. వీటిల్లో తనిఖీలు చేస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వర రావు Way2Newsకు వివరించారు. మీ దగ్గర పాలు బాగుంటాయా? లేదా?
News February 26, 2026
నెల్లూరు: కౌలు రైతులకు రిక్త హస్తం..!

2025-26 ఏడాదికి 38 వేల మందికి CCRC(పంట సాగుదారు హక్కు పత్రాలు) ఇవ్వాల్సి ఉండగా 22,600 మందికి మాత్రమే ఇచ్చారు. వీరికి ఇచ్చిన రుణాలపై లీడ్ బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులు వద్ద లెక్కలు లేవట. యజమానులు తమ భూములుపై ఇప్పటికే రుణాలు తీసుకోగా కౌలు కార్డుదారులకు రుణాలు అందడం లేదు. దీంతో బ్యాంకు రుణాలు అందక.. బయట అధిక వడ్డీల భారం మోయలేక కౌలు రైతులు డీలా పడుతున్నారు. రబీ స్టార్ట్ అయి 2 నెలలు అవుతోంది.


