News December 23, 2024

NLR: పాపం.. బిర్యానీలో విషం పెట్టి చంపేశారు..!

image

అందరూ అయ్యో పాపం అనేలా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమవారం దారుణ ఘటన వెలుగు చూసింది. సూళ్లూరుపేట గాండ్ల వీధి షార్ బ్రిడ్జి కింద పదుల సంఖ్యలో కుక్కలు చనిపోయాయి. ఎవరో కావాలనే బిర్యానీలో విషం పెట్టి కుక్కలను చంపేశారని స్థానికులు చెబుతున్నారు. వాటితో ఇబ్బంది ఉంటే పట్టుకెళ్లి దూరంగా వదిలేయాలి కానీ.. ఇలా విషం పెట్టి చంపడం ఘోరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 3, 2025

నెల్లూరు: అవిశ్వాసానికి TDP “సై”..!

image

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిని గద్దె దించేందుకు TDP చేసిన ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 54 డివిజన్లకు సంబంధించిన YCP కార్పొరేటర్లలో 42 మందిని TDP తన వైపుకు తిప్పుకుంది. దీంతో వైసీపీకి ఇంకా 12మంది మాత్రమే మిగిలారు. ఇటీవల అవిశ్వాసంపై కలెక్టర్‌కు నోటీసు ఇవ్వగా.. నేడు దానికి అనుమతి లభించింది. దీంతో ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సమావేశం నిర్వహించేలా TDP కార్యాచరణ మొదలెట్టింది.

News December 3, 2025

నెల్లూరు: అవిశ్వాసానికి TDP “సై”..!

image

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిని గద్దె దించేందుకు TDP చేసిన ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 54 డివిజన్లకు సంబంధించిన YCP కార్పొరేటర్లలో 42 మందిని TDP తన వైపుకు తిప్పుకుంది. దీంతో వైసీపీకి ఇంకా 12మంది మాత్రమే మిగిలారు. ఇటీవల అవిశ్వాసంపై కలెక్టర్‌కు నోటీసు ఇవ్వగా.. నేడు దానికి అనుమతి లభించింది. దీంతో ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సమావేశం నిర్వహించేలా TDP కార్యాచరణ మొదలెట్టింది.

News December 3, 2025

Way2News ఎఫెక్ట్.. స్పందించిన కోటంరెడ్డి

image

నెల్లూరు రూరల్ కల్లూరుపల్లి హోసింగ్ బోర్డు కాలనీలో గంజాయి ముఠా దాడిలో మృతి చెందిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోలేరా అనే శీర్షికన Way2Newsలో కథనం ప్రచురితమైంది. దీనిపై రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. పెంచలయ్య బిడ్డలను ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందజేస్తానని చెప్పారు.