News April 12, 2024

NLR: ఫలితాల కోసం 52,076 మంది వెయిటింగ్

image

ఇంటర్ పరీక్షా ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆస్ఐఓ డాక్టర్ ఆదూరు శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాలో ప్రథమ సంవత్సర పరీక్షలకు 26,419 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 25,657 మంది హాజరయ్యారు. మొత్తంగా 52,076 మంది ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు.

Similar News

News November 14, 2025

గుడ్లూరు: హైవేపై విషాదం.. దంపతులు మృతి

image

గుడ్లూరు (M)మోచర్ల సమీపంలోని హైవేపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో NTR(D) జి కొండూరు(M) చెవుటూరుకు చెందిన మురళీకృష్ణ, ఆయన భార్య మాధవీలత, కుమార్తె లిఖిత గాయపడ్డారు. నెల్లూరు కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వెంకట్రావు తెలిపారు.

News November 13, 2025

నెల్లూరు జిల్లా వాసికి కీలక పదవి

image

నెల్లూరు(D) విడవలూరుకు చెందిన సుమంత్ రెడ్డిని TTD ఢిల్లీ దేవాలయ స్థానిక సలహా కమిటీ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దేశ రాజధానిలోని ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ప్రతి వారం వేలాది మంది భక్తులను దర్శించుకుంటారు. ఇటీవలే సుమంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం సుమంత్ మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈయన నెల్లూరు DCMS ఛైర్మన్ గానూ పని చేశారు.

News November 13, 2025

జగన్‌తో మాజీ మంత్రి అనిల్ భేటీ

image

తాడేపల్లిలో YCP అధినేత జగన్‌ను ఆయన నివాసంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా వారు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. నాయకులు, నేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై మరింతగా ముందుకు వెళ్లాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.