News April 20, 2025

NLR: చెట్టును ఢీకొట్టిన బైక్.. యువతి మృతి

image

నెల్లూరు జిల్లాలో ఉదయాన్నే జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లి సమీపంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై ఓ బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న యువతి అక్కడికక్కడే మృతిచెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 20, 2025

మనుబోలు: పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

image

మనుబోలు మండలంలోని వడ్లపూడి వద్ద ఆదివారం కారు బోల్తా పడి అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఐదుమంది ఉన్నారు. వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. పొదలకూరు మండలం బిరదవోలు రాజుపాలెంకు చెందిన వారు కొత్త కారును కొనుగోలు చేసి గొలగమూడిలో పూజలు చేయించుకొని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

News April 20, 2025

రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్: మంత్రి నారాయణ

image

నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్‌ను అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలో 48వ డివిజన్‌లో సురక్షిత తాగునీటి పథకంలో భాగంగా  డిస్పెన్సింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. పేద ప్రజల కోసం 2018లోని ఎన్టీఆర్ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామన్నారు.

News April 20, 2025

నెల్లూరులో 647 టీచర్ పోస్టులు

image

డీఎస్సీ-2025 ద్వారా నెల్లూరు జిల్లాలో 647 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్-1:39
➤ హిందీ:18 ➤ ఇంగ్లిష్: 84
➤ గణితం: 63 ➤ఫిజిక్స్: 76
➤ జీవశాస్త్రం: 63 ➤ సోషల్: 103
➤ పీఈటీ: 107 ➤ఎస్జీటీ: 115 ఉన్నాయి.
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఎస్ఏ హిందీ 1, ఇంగ్లిష్ 1, మ్యాథ్స్ 1, ఎస్టీటీ 2 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.

error: Content is protected !!