News April 11, 2024
NLR: ‘జనసేనకు పట్టిన దరిద్రం పోయింది’
నెల్లూరు జిల్లాలో జనసేనకు పట్టిన దరిద్రం పోయిందని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డిని వైసీపీ నాయకులు కలవడంతో సంబరాలు చేసుకున్నారు. మనుక్రాంత్ రెడ్డి జనసేనను వీడితే తమకు సంతోషమేనని.. కానీ పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోమని హెచ్చరించారు. తర్వాత బాణసంచా కాల్చి స్వీట్స్ పంచుకున్నారు.
Similar News
News September 30, 2024
నెల్లూరు: RTC బస్సు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్
సంగం- కొరిమెర్ల మార్గమధ్యంలో రోడ్డు మలుపు వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెంకు చెందిన నరసింహరావు(24) ఏఎస్ పేటలో జరిగే గంధమహోత్సవానికి బైక్పై వెళ్తుండగా సంగం- కలిగిరి రహదారిలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 29, 2024
గూడూరులో దారుణం.. విద్యార్థిపైకి దూసుకెళ్లిన కారు
గూడూరు పట్టణ పరిధిలోని SKR ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వంశీ అనే యువకుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి విద్యార్థిపైకి కారు దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన లీలా విక్షత్ (11) అనే విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నట్లు సమాచారం. వంశీని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.
News September 29, 2024
కలువాయి మండలంలో మరో సైబర్ క్రైం
కలువాయిలో ఆశా వర్కర్ ఖాతా నుంచి నగదు కొట్టేసిన ఘటన తెలిసిందే. అదే మండలంలోని ఉయ్యాలపల్లి సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న యస్. వెంకటరమణమ్మ ఖాతా నుంచి రూ.33,350 సైబర్ నేరగాళ్లు కొట్టేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీ మొబైల్లో ఈ-సిమ్ యాక్టివేట్ అయ్యింది ప్రొఫైల్ ‘ON’ చేయమని మెసేజ్ వచ్చింది. దీనితో ఆమె ‘ON’ నొక్కగానే ఖాతా నుంచి నగదు డెబిట్ అయ్యిందని ఆమె తెలిపారు.