News September 20, 2024
NLR: రూ.2.16 కోట్లు కొట్టేసిన మేనేజర్..!
ఓ మేనేజర్ రూ.2.16 కోట్లు స్వాహా చేసిన ఘటన నాయుడుపేట మండలంలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. పండ్లూరు వద్ద వెయిట్ లెస్ బ్రిక్స్ పరిశ్రమలో మేనేజర్గా కాట్రగడ్డ సురేశ్ పనిచేస్తున్నారు. రెండేళ్లుగా నకిలీ బిల్లులు సృష్టించారు. ఇలా దాదాపు రూ.2.16 కోట్లు స్వాహా చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మేనేజర్తో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిపై నాయుడుపేట సీఐ బాబి చీటింగ్ కేసు నమోదు చేశారు.
Similar News
News September 20, 2024
28న నెల్లూరు జిల్లా విజయ డెయిరీ ఎన్నికలు
నెల్లూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి(విజయ డెయిరీ) ఎన్నికలను ఈనెల 28న నిర్వహించనున్నామని ఎన్నికల అధికారి హరిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 23న నామినేషన్ల స్వీకరణ, అదే రోజున పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీ గడువు. 28న ఓటింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం ఓట్లను లెక్కిస్తారు.
News September 20, 2024
నెల్లూరు: హెడ్ కానిస్టేబుల్ మృతి
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్ చనిపోయారు. నాగరాజు వెంకటగిరిలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆయన నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో గురువారం చనిపోయారని ఆయన కుటుంబీకులు తెలిపారు. వెంకటగిరి సీఐ ఏవీ రమణ, ఎస్ఐ సుబ్బారావు మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
News September 20, 2024
నేటి నుంచి మంత్రి ఆనం నెల్లూరు జిల్లా పర్యటన
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి 26వ తేదీ వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 20న చేజర్ల మండలం మాముడూరు, 21 సంగం మండలం జండాదిబ్బ, 22న ఏఎస్పేట హస్నాపురం, 23న ఆత్మకూరు మున్సిపాలిటీ పేరారెడ్డిపల్లి, 24న అనంతసాగరం, లింగంగుంట, 25న మర్రిపాడు, తిక్కవరం, 26న ఆత్మకూరు, చెర్లో ఎడవల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు.