News September 20, 2024
లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు: ఏఆర్ డెయిరీ
తిరుమల లడ్డూ వ్యవహారంపై టీటీడీకి నెయ్యి సరఫరా చేసే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ స్పందించింది. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని వెల్లడించింది. ఇదే విషయాన్ని టీటీడీకి వివరించినట్లు చెప్పింది. జులైలో 16 టన్నుల నెయ్యి సరఫరా చేశామని వెల్లడించింది.
Similar News
News September 20, 2024
రాజకీయ కార్యాచరణపై దళపతి విజయ్ ప్రకటన
తమిళగ వెట్రి కళగం మొదటి రాష్ట్ర స్థాయి సదస్సును అక్టోబర్ 27న విల్లుపురం జిల్లాలోని విక్రవాండి వి సలై గ్రామంలో నిర్వహించనున్నట్టు దళపతి విజయ్ ప్రకటించారు. తమిళ ప్రజల అభిమానం, మద్దతుతో తమ విజయవంతమైన రాజకీయ యాత్ర సాగుతోందన్నారు. పార్టీ రాజకీయ భావజాల నేతలను, పార్టీ సిద్ధాంతాలను, విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను సదస్సులో ప్రకటించనున్నట్టు విజయ్ తెలిపారు.
News September 20, 2024
వర్క్ లైఫ్ బ్యాలెన్స్.. యూరప్లో బెస్ట్
సౌత్ఏషియాతో పోలిస్తే యూరప్ దేశాల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెరుగ్గా ఉంది. ఇక్కడ వారానికి సగటున 35Hrs మాత్రమే పనిచేస్తున్నారని ILO తెలిపింది. నెదర్లాండ్స్లో 31.6, నార్వేలో 33.7, జర్మనీలో 34.2, జపాన్లో 36.6, సింగపూర్ 42.6 గంటలు పనిచేస్తున్నారు. ఇక వనాటులో ఉద్యోగులు సగటున 24.7 గంటలే పనిచేస్తుండటం గమనార్హం. కిరిబాటి 27.3, మైక్రోనేషియా 30.4 గంటలతో తక్కువ పనివేళల జాబితాలో ముందున్నాయి.
News September 20, 2024
నెయ్యి నాణ్యత 100 పాయింట్లకు 20 పాయింట్లే ఉంది: టీటీడీ ఈఓ
AP: నెయ్యి నాణ్యత ఉంటేనే, లడ్డూ నాణ్యతగా ఉంటుందని టీటీడీ ఈఓ శ్యామలరావు అన్నారు. గతంలో వాడిన నెయ్యి నాణ్యత 100 పాయింట్లకుగానూ 20 పాయింట్లే ఉందని ఆయన తెలిపారు. ‘గతంలో ఏఆర్ డెయిరీ వచ్చిన 4 ట్యాంకర్లలోని నెయ్యిని తిరిగి పంపాం. ఆ నెయ్యిని 10 ల్యాబ్లలో పరీక్షించాం. వారంలో రిపోర్టు వచ్చింది. ఆ నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు రిపోర్టులో తేలింది’ అని ఆయన పేర్కొన్నారు.