News June 29, 2024

BRS ఎమ్మెల్యేలకు నో బెర్త్?

image

TG: BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన MLAలకు మంత్రి పదవులు ఇవ్వొద్దని CM రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బీ ఫాంతో గెలిచిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఎక్కువ మంది బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పినట్లు టాక్. తాజా విస్తరణలో నాలుగు మంత్రి పదవులను భర్తీ చేసి, రెండు పదవులను పెండింగ్‌లో పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.

Similar News

News January 16, 2026

కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు వేయాలి?

image

కనుమ నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. మన దేహం ఓ రథమని, దానిని నడిపించేది ఆ పరమాత్ముడేనని ఈ ముగ్గు మనకు గుర్తు చేస్తుంది. మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని దేవుడ్ని ప్రార్థించేందుకు ఇదో సంకేతం. అలాగే ఈ ముగ్గు సంక్రాంతికి భూలోకానికి వచ్చిన బలిచక్రవర్తికి గౌరవపూర్వకంగా వీడ్కోలు పలికేందుకు కూడా వేస్తారు. ఒక ఇంటి రథం ముగ్గు తాడును మరో ఇంటి ముగ్గుతో కలపడం సామాజిక ఐక్యతకు, ప్రేమానురాగాలకు నిదర్శనం.

News January 16, 2026

ఇరాన్ గగనతలం ఓపెన్.. ఖతర్ తిరిగొచ్చిన US బలగాలు

image

ఇరాన్-అమెరికా మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు కొంత మేర తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇరాన్‌పై దాడి చేసే ఉద్దేశం లేదని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో పరిస్థితులు సాధారణ దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం మూసివేసిన ఇరాన్ గగనతలాన్ని తిరిగి రీ-ఓపెన్ చేయగా, ఖతర్‌లోని ఎయిర్‌బేస్‌కు US బలగాలు మళ్లీ చేరుకున్నాయి. దీంతో ఇరు దేశాలూ శాంతించినట్లు స్పష్టం అవుతోంది.

News January 16, 2026

విజయ్‌ హజారే ట్రోఫీ.. పైనల్‌కు దూసుకెళ్లిన విదర్భ

image

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ క్రికెట్ జట్టు కర్ణాటకపై ఘన విజయాన్ని సాధించి ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 280 పరుగులు చేసింది. దర్శన్ నల్కాండే ఐదు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌లో విదర్భ యువ బ్యాటర్ అమన్ మొఖాడే 138 రన్స్‌తో సత్తా చాటారు. మరోవైపు ఈరోజు పంజాబ్-సౌరాష్ట్ర మధ్య మరో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో విజయం సాధించిన టీమ్ 18వ తేదీన విదర్భతో ఫైనల్‌లో తలపడనుంది.