News December 1, 2024
భారత్-బంగ్లాదేశ్కు పెద్ద తేడా లేదు: ముఫ్తీ

భారత్-బంగ్లాదేశ్ మధ్య తేడా లేదని PDP చీఫ్ మెహబూబా ముఫ్తీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. UPలోని సంభల్ మసీదు సర్వే సందర్భంగా చెలరేగిన అల్లర్లు, జరిగిన ప్రాణ నష్టాన్ని బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను పోల్చుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మసీదులు, దర్గాలపై తలెత్తుతున్న వివాదాలు ఆందోళనకరమన్నారు. ఇవి 1947 నాటి దేశ పరిస్థితుల వైపు తీసుకెళ్తున్నాయనే భయం నెలకొందన్నారు.
Similar News
News October 15, 2025
ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చి.. కొడుకుకు తండ్రి గుణపాఠం!

TG: తన బాగోగులు చూసుకోని కొడుకుకు సరైన గుణపాఠం చెప్పాడా తండ్రి. హన్మకొండ(D) ఎల్కతుర్తి మాజీ MPP శ్యాంసుందర్ రూ.3Cr విలువైన మూడెకరాల భూమిని ప్రభుత్వానికి రాసిచ్చారు. ప్రభుత్వ స్కూల్/ కాలేజీ కట్టి తన భార్య పేరు పెట్టాలని కోరారు. భార్య మరణించినప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆయనను కొడుకు రంజిత్ రెడ్డి చేరదీయలేదు. పైగా కొంత ఆస్తి తన పేరిట రాయించుకొని దాడి చేశారు. దీంతో శ్యాంసుందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
News October 15, 2025
ఆవు పేడతో నెలకు రూ.25వేల ఆదాయం

జీవితంలో ఎదగాలనే తపన ఉంటే ఆవు పేడతోనూ అద్భుతాలు చేయొచ్చని నిరూపిస్తున్నారు మధ్యప్రదేశ్ సాగర్ ప్రాంత మహిళలు. పేడతో కుందులు, బొమ్మలు, ల్యాంప్స్, గోడ గడియారాల లాంటివి తయారు చేసి విక్రయిస్తున్నారు. కొన్ని వస్తువులను విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా సగటున ₹25K వరకు సంపాదిస్తున్నారు. పండుగ సమయాల్లో ఈ మొత్తం ₹80వేలకు చేరుతోంది.
* రోజూ మహిళల స్ఫూర్తిదాయక కథనాల కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 15, 2025
పంచ భూతాలేనా? ఆరోది కూడా ఉందా?

ఈ అనంత విశ్వం పంచభూతాల కలయికతోనే ఏర్పడింది. ఆరో భూతం లేదు. చైతన్య స్వరూపుడైన పరమాత్మ ఈ 5 శక్తుల ద్వారానే సృష్టిని నడుపుతాడు. భూమి సృష్టికి ఆధారం కాగా, జలం వృద్ధి చేస్తుంది. అగ్ని మార్పును తీసుకురాగా, వాయువు జీవాన్ని ఇస్తుంది, తీసుకుపోతుంది. ఆకాశం సర్వాన్నీ అనుగ్రహిస్తుంది. ప్రజల సుఖ దుఃఖాలు, విశ్వ భవిష్యత్తు ఈ ప్రకృతి శక్తులపైనే ఆధారపడి ఉంటాయనే సత్యాన్ని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు.<<-se>>#SIVOHAM<<>>