News October 12, 2024
రేపటి మ్యాచ్లో ఈ ప్లేయర్లకు నో ఛాన్స్?
హైదరాబాద్ వేదికగా శనివారం బంగ్లాదేశ్తో జరగనున్న చివరి టీ20 మ్యాచ్లో ముగ్గురు భారత ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గత రెండు మ్యాచ్లలో చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయని సంజూ శాంసన్ స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి రావచ్చని తెలుస్తోంది. అలాగే, వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్ స్థానంలో హర్షిత్ రాణాకు చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
Similar News
News October 12, 2024
తెలుగు ప్రజలకు చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటామని తెలిపారు. దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలసి మెలసి జీవించాలన్నదే ఈ పండుగ సందేశమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలంతా చల్లగా చూడాలని దుర్గమ్మను ప్రార్థించానని చెప్పారు.
News October 12, 2024
20 నియోజకవర్గాల్లో అక్రమాలు: జైరాం రమేశ్
హరియాణా ఎన్నికల ఫలితాల విషయంలో తాము లేవనెత్తిన అభ్యంతరాలపై EC విచారణ జరుపుతుందని భావిస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా 20 స్థానాల్లో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. కౌంటింగ్కి ఉపయోగించిన EVMలు, వాటి బ్యాటరీ సామర్థ్యాలపై కాంగ్రెస్ అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తారని, అక్రమాలు జరిగిన EVMలను సీల్ చేయాల్సిందిగా ఆయన కోరారు.
News October 12, 2024
అక్టోబర్ 12: చరిత్రలో ఈ రోజు
1911: భారత మాజీ క్రికెటర్ విజయ మర్చంట్ జననం
1918: తెలుగు సినీ నిర్మాత రామకృష్ణారావు జననం
1946: భారత మాజీ క్రికెటర్ అశోక్ మన్కడ్ జననం
1967: సోషలిస్ట్ నాయకుడు రామ్మనోహర్ లోహియా మరణం
1981: నటి స్నేహ జననం