News October 13, 2025
15 నెలలవుతున్నా మార్పులేదు: అమరావతి రైతు ఐకాస

AP: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలవుతున్నా తమ సమస్యలు పరిష్కారం కాలేదని అమరావతి రైతు ఐకాస నాయకులు వాపోయారు. అసైన్డ్ రైతుల భూములు, కౌలు చెల్లింపులు, ప్లాట్ కేటాయింపులు తదితరాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్నారు. CRDAలో కిందిస్థాయి అధికారులు రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. CM వీలైనంత త్వరగా తమతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
Similar News
News October 13, 2025
కోల్డ్రిఫ్ దగ్గు మందు కేసు.. చెన్నైలో ఈడీ సోదాలు

కోల్డ్రిఫ్ దగ్గు మందు వ్యవహారంపై కేంద్రం దర్యాప్తు ముమ్మరం చేసింది. సిరప్ తయారీ సంస్థ శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్కు చెందిన 7 ప్రాంతాల్లో ఎఫ్డీఏ అధికారులతో కలిసి ఈడీ సోదాలు చేస్తోంది. చెన్నైలో డ్రగ్ కంట్రోల్ ఆఫీసు అధికారుల ఇళ్లలోనూ రెయిడ్స్ జరుగుతున్నాయి. కోల్డ్రిఫ్ సిరప్ తాగి MPలో 20 మందికి పైగా చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో శ్రీసన్ కంపెనీ ఓనర్ రంగనాథన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.
News October 13, 2025
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

TG: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం 5.30 గంటల సమయంలో హైదర్గూడలోని ఆసుపత్రిలో మృతి చెందారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉమ్మడి APలో ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్తో పాటు పలు పదవుల్లో పనిచేశారు. 1999, 2014లో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
News October 13, 2025
నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 271 పాయింట్లు పతనమై 82,229 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 25,209 వద్ద ట్రేడవుతున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పేయింట్స్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా టాటా మోటార్స్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.