News October 13, 2025
15 నెలలవుతున్నా మార్పులేదు: అమరావతి రైతు ఐకాస

AP: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలవుతున్నా తమ సమస్యలు పరిష్కారం కాలేదని అమరావతి రైతు ఐకాస నాయకులు వాపోయారు. అసైన్డ్ రైతుల భూములు, కౌలు చెల్లింపులు, ప్లాట్ కేటాయింపులు తదితరాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్నారు. CRDAలో కిందిస్థాయి అధికారులు రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. CM వీలైనంత త్వరగా తమతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
Similar News
News February 11, 2026
శాస్త్ర రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం అందించడం కోసం ఓ రోజు ఉండాలని యునెస్కో నిర్ణయించింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ జయంతి అయిన ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా నిర్వహించాలని 2015లో నిర్ణయించింది. సైన్స్&టెక్నాలజీ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
News February 11, 2026
మారిన చైనా వైఖరి: UNSCలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు!

UNSCలో భారత్ శాశ్వత సభ్యత్వ ఆకాంక్షలను ‘గౌరవిస్తాం’ అని చైనా ప్రకటించింది. గతంలో ఆ దిశగా ఇండియా చేసిన యత్నాలను వ్యతిరేకించిన ఏకైక శాశ్వత సభ్యదేశం చైనా కావడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన చర్చల్లో భారత్ అధ్యక్షతన జరగబోయే BRICS సదస్సుకు కూడా చైనా పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మార్పు అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాబల్యాన్ని పెంచడంతో పాటు మండలిలో శాశ్వత సభ్యత్వానికి మార్గాన్ని సుగమం చేసే ఛాన్స్ ఉంది.
News February 11, 2026
ESIC హాస్పిటల్ భిలాయ్లో ఉద్యోగాలు

<


