News July 11, 2024
ఉక్రెయిన్ విషయంలో రష్యాతో వైరుధ్యాల్లేవు: కేంద్రం

ఉక్రెయిన్ విషయంలో భారత్ రష్యాతో విభేదించిందన్న వార్తల్ని కేంద్రం కొట్టిపారేసింది. ప్రధాని రష్యా పర్యటనలో డెలిగేషన్ స్థాయి సమావేశాన్ని కూడా భారత్ క్యాన్సిల్ చేసుకుందంటూ వచ్చిన వదంతులపై విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్ క్వాత్రా స్పష్టతనిచ్చారు. ‘నాకు తెలిసినంత వరకు అలాంటివేమీ జరగలేదు. వాస్తవం లేని ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కాదు. పీఎం రష్యా పర్యటన సూపర్ సక్సెస్ అయింది’ అని తెలిపారు.
Similar News
News December 9, 2025
ఇదీ సంగతి: ఫోన్పే కొట్టు.. ఓటు పట్టు!

TG: రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలకు ప్రచారం ముగియడంతో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రలోభాలకు తెరలేపారు. గ్రామంలో ఉన్న ఓటర్లకు నేరుగా డబ్బులు పంచుతుండగా వలస ఓట్లపైనా దృష్టి పెట్టారు. వారికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. తప్పకుండా తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఫోన్పే, గూగుల్ పే వంటి UPI పేమెంట్స్ ద్వారా డబ్బులు పంపుతున్నారు. ఓటుకు రేట్ కట్టడంతో పాటు రానుపోను దారి ఖర్చులకు ‘Pay’ చేస్తున్నారు.
News December 9, 2025
పేదలు, రైతుల చుట్టే నా ఆలోచనలు: CM రేవంత్

తన ఆలోచనలు, TG విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు పేదలు, రైతుల చుట్టే తిరుగుతాయని CM రేవంత్ అన్నారు. ‘నేను ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చా. SC, ST, BC, మైనారిటీలతో కలిసి పెరిగా. వారి సమస్యలు తెలుసు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్తో పాటు కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇవ్వనున్నాం. చైనా, జపాన్, కొరియా, సింగపూర్ మాకు రోల్ మోడల్స్. అభివృద్ధిలో వాటితో పోటీ పడతాం’ అని డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
News December 9, 2025
సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యం: CM

TG: నీతి ఆయోగ్, ISB, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజల సూచనలు, సలహాలతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. 83 పేజీలతో తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో విజన్ డాక్యుమెంట్ను ఆయన ఆవిష్కరించారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ డాక్యుమెంట్ను తీసుకొచ్చామన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.


