News April 11, 2025

గోశాలలో ఆవులు మృతి చెందలేదు: TTD

image

తిరుమల గోశాలలో వందల ఆవులు <<16061861>>మృతి చెందాయని <<>>జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కాదని తేల్చి చెప్పింది. దురుద్దేశంతో కొందరు మృతి చెందిన గోవుల ఫొటోలను పోస్ట్ చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడింది. భక్తులు ఇలాంటివి నమ్మవద్దని కోరింది.

Similar News

News October 14, 2025

ఎల్లో అలర్ట్: కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో కాసేపట్లో HYD, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News October 14, 2025

ఫిట్‌నెస్, ఫామ్‌ ఉంటేనే WC జట్టులో RO-KO: రవిశాస్త్రి

image

2027 WCలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అది వారి హంగర్, ఫిట్‌నెస్, ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. AUSతో వన్డే సిరీస్ పూర్తయ్యేలోగా జట్టులో కొనసాగాలో వద్దో వారిద్దరికీ క్లారిటీ వస్తుంది. ఇప్పటికే గిల్, జైస్వాల్, తిలక్ లాంటి యంగ్ ప్లేయర్లు చాలా మంది సత్తా చాటుతున్నారు. కాబట్టి రోహిత్, కోహ్లీ రాణించాల్సిందే’ అని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

News October 14, 2025

వెంకటేశ్ మూవీ హిందీ రీమేక్‌లో అక్షయ్

image

వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతోంది. అయితే ఈ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అందులో తాను హీరోగా నటిస్తున్నట్లు అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తుండగా.. హీందీలోనూ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.