News January 8, 2025

పరీక్షల తొలగింపుపై నిర్ణయం జరగలేదు: BIE

image

ఫస్ట్ ఇయర్ బోర్డు పరీక్షల తొలగింపుపై తుది నిర్ణయం జరగలేదని ఏపీ ఇంటర్ బోర్డు వెల్లడించింది. కొత్త ప్రతిపాదనలపై ప్రస్తుతం సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. అన్ని వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది.

Similar News

News August 20, 2025

బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలున్నాయా?

image

నెల రోజులు జైలుకెళ్లిన మంత్రుల తొలగింపు బిల్లు పార్లమెంటులో పాస్ అవుతుందా? అనే ప్రశ్న నెలకొంది. రాజ్యాంగ సవరణకు ఉభయసభల్లో 2/3 మెజారిటీ ఉండాలి. లోక్‌సభలో 543 సీట్లలో 362 సభ్యుల మద్దతు కావాల్సి ఉండగా NDA బలం 293. ఇక రాజ్యసభలోని 245 సభ్యుల్లో 164 మంది ఒప్పుకోవాలి. అక్కడ అధికారపక్షానికి ఉన్నది 125. సొంత సంఖ్యా బలం లేక, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బిల్లు ఆమోదం ఎలా? అనేది చూడాలి.

News August 20, 2025

BREAKING: రాష్ట్రంలో తీవ్ర విషాదం

image

AP: కర్నూలు (D) ఆస్పరి (M) చిగిలిలో విషాదం నెలకొంది. నీటి కుంటలో ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. చనిపోయిన చిన్నారులంతా ఐదో తరగతి విద్యార్థులు అని స్థానికులు తెలిపారు. మృతులను శశికుమార్, సాయి, కిరణ్, భీమ, వీరేంద్ర, మహబూబ్‌గా గుర్తించారు. వారి మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆరుగురు చిన్నారుల మృతి పట్ల మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

News August 20, 2025

ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు.. AG సలహా తీసుకోనున్న ప్రభుత్వం!

image

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు కోదండరామ్, అమీర్ అలీఖాన్ సభ్యత్వాలను <<17393463>>రద్దు<<>> చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు కాపీపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది. దీనిపై అడ్వకేట్ జనరల్‌(AG)ను సంప్రదించాలని నిర్ణయించింది. AG సలహా మేరకు ఈసీకి రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.