News June 3, 2024

కాకతీయ కళాతోరణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: సీతక్క

image

TG: రాష్ట్రీయ గీతాన్ని వివాదం చేయడం తగదని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళాతోరణం కొనసాగింపు లేదా తొలగింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మెజారిటీ ప్రజల ఇష్టం మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న విశ్వాసం ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 9, 2026

జెమినీ, చాట్‌GPTకి దీటుగా మన ‘సర్వం ఏఐ’!

image

AI దిగ్గజాలు గూగుల్ జెమినీ, చాట్‌GPTలకు మన కంపెనీ సవాలు విసురుతోంది. బెంగళూరు స్టార్టప్ ‘సర్వం ఏఐ’ రిలీజ్ చేసిన Sarvam Vision, Bulbul టూల్స్ సంచలనం రేపుతున్నాయి. వర్డ్ అక్యూరసీలో 87.3%, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్(OCR)లో 84.3%, ఎర్రర్ రేటులో 8.6%తో జెమినీ, చాట్‌GPT, ఆంథ్రోపిక్ క్లౌడ్‌ కన్నా ఎంతో మెరుగైన ప్రదర్శనను కనబరిచాయి. ప్రస్తుతం ఇవి టెక్ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

News February 9, 2026

సర్వం ఏఐ.. ఇంతకీ ఏంటిది?

image

సర్వం ఏఐ కంపెనీని 2023లో వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్ స్థాపించారు. హైఎండ్ క్లౌడ్ కంప్యూటర్ల కోసమే కాకుండా ఫోన్లు, స్థానిక భాషల కోసం దీన్ని రూపొందించారు. భారత భాషల్లోని క్లిష్టమైన డాక్యుమెంట్లనూ Sarvam Vision ఈజీగా చదివేస్తోంది. text-to-speech టూల్ ‘Bulbul’ 11 భారత భాషల్లో 32 వాయిస్‌లు అందిస్తోంది. చౌకగా, స్థానిక భాషలతో, స్క్రిప్టులను చదవడంలో మేలైన OCRతో ఇక్కడి సంస్థలను సర్వం ఏఐ ఆకర్షిస్తోంది.

News February 9, 2026

రూ.20కే గోధుమ పిండి.. పంపిణీ షురూ

image

AP: రేషన్ కార్డుదారులకు రూ.20కే కేజీ గోధుమ పిండి అందించే కార్యక్రమాన్ని మంత్రి మనోహర్ నిన్న తెనాలిలో ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో 1,800 టన్నుల గోధుమ పిండి పంపిణీ చేస్తున్నామని, రానున్న రోజుల్లో అన్ని చోట్లా ఇస్తామని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా నెలలో 15 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు సరకులు తీసుకోవచ్చని తెలిపారు.