News August 9, 2025

ఛార్జీలు పెంచలేదు: TGSRTC

image

TG: రాఖీ పండుగ సందర్భంగా RTC బస్సుల్లో ఛార్జీలు పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ఖండించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని, వాటిలో మాత్రమే 30% అదనపు ఛార్జీలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. రెగ్యులర్ బస్సుల్లో ఎలాంటి పెంపు లేదని పేర్కొంది. స్పెషల్ బస్సుల్లో ఛార్జీల పెంపు కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని, అన్ని పండగలకూ ఈ విధానాన్నే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.

Similar News

News August 9, 2025

గురుకుల స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

TG: రక్షాబంధన్ సందర్భంగా ఇవాళ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్(VHP) డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యార్థులకు సెలవు ఇవ్వకుండా టీచర్లు, ఇతర అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆత్మీయంగా చేసుకునే రాఖీ పండుగ సందర్భంగా వాళ్లను ఇళ్లకు పంపాలని కోరింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సీఎస్‌కు లేఖ రాసింది.

News August 9, 2025

ఆడపడుచులకు సీఎంల రాఖీ శుభాకాంక్షలు

image

రాఖీ పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఆడపడుచులకు CMలు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మీ అందరికీ అన్నగా రక్షణ కల్పించి, జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది. ఆడబిడ్డల బాగు కోసం అహర్నిశలూ పనిచేస్తా’ అని AP CM చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. స్త్రీలను కోటీశ్వరులుగా చేసే సంకల్పంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది’ అని TG CM రేవంత్ రెడ్డి అన్నారు.

News August 9, 2025

దివ్యాంగులు, బాలికలతో స్పెషల్ హెల్ప్ గ్రూపులు

image

TG: మహిళా సంఘాల తరహాలో దివ్యాంగులు, బాలికలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దివ్యాంగుల్లో స్త్రీ, పురుషులతో సంఘాలు ఏర్పాటు చేసి ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు అందించనున్నారు. వ్యాపారాల కోసం రుణాలు ఇస్తారు. అటు 15-18 ఏళ్ల బాలికలతో SHGలు ఏర్పాటు చేసి నగదు పొదుపు, SM మోసాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ నెల 11 నుంచి ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం.