News July 29, 2024
జగన్ జైలుకి వెళ్లకుండా ఏ శక్తీ ఆపలేదు: మంత్రి

AP: ఆర్థిక నేరారోపణ కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ను జైలుకి వెళ్లకుండా ఏ శక్తీ ఆపలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సంపాదనే లక్ష్యంగా జగన్ ఐదేళ్లూ పాలన సాగించారని ఆరోపించారు. ‘అసెంబ్లీకి రాకుండా ఉండేందుకే జగన్ ఢిల్లీ డ్రామా ఆడారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, YCP కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని నిరసన చేయడం పెద్ద నాటకం. దాడులపై వివరాలు ఇవ్వమంటే ఇంతవరకు సమాధానం లేదు’ అని మండిపడ్డారు.
Similar News
News November 26, 2025
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.
News November 26, 2025
IIIT-నాగపుర్లో ఉద్యోగాలు

<
News November 26, 2025
టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

AP: ఇటీవల ఉదయ్పూర్లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.


