News May 18, 2024
ఏ ప్రభుత్వమూ రాజ్యాంగాన్ని మార్చలేదు: గడ్కరీ

రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వమూ మార్చలేదని బీజేపీ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు చూస్తోందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. మహారాష్ట్రలోని నాసిక్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగంలో కేవలం సెక్షన్లు మార్చడం, సవరించేందుకు అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ 80సార్లు రాజ్యాంగాన్ని సవరించి పాపం మూటగట్టుకుందని విమర్శించారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


