News May 20, 2024
మేడిగడ్డ నిలబడుతుందనే గ్యారంటీ లేదు: మంత్రి

TG: మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసినా నిలబడుతుందనే గ్యారంటీ లేదని NDSA కమిటీ చెప్పిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులపై నిపుణుల కమిటీ ఏం చెప్తే అది చేస్తామన్నారు. సాంకేతిక కమిటీ సూచనలకు విరుద్ధంగా పనిచేసి ప్రజాధనం వృథా చేయదలుచుకోలేదని చెప్పారు. తాత్కాలికంగా రైతులకు నీరు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు.
Similar News
News November 17, 2025
నెల్లూరు: సదరం.. నాట్ ఓపెన్..!

వికలాంగత్వ ధ్రువీకరణ కోసం తీసుకొచ్చిన “సదరం” సైట్ ఓపెన్ కావడం లేదు. ఈనెల 14 న సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చినా.. రెండు రోజులకే మూతపడింది. అదేమిటంటే ఒకసారి స్లాట్స్ అయిపోయాయని చెప్పుకొచ్చారు. వెయిటింగ్ లిస్ట్ కింద అయినా దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నం చేయగా.. సైట్ క్లోజ్ అయిపొయింది. ఇదేమి విచిత్రమని ప్రజలు వాపోతున్నారు. ఏడాది నుంచి ఇవే తిప్పలు ఎదురవుతున్నాయి.
News November 17, 2025
షేక్ హసీనాకు మరణశిక్ష

బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. ఢాకా అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. గతేడాది విద్యార్థుల ఆందోళనల సమయంలో 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం హసీనా భారత్లో తల దాచుకుంటున్నారు.
News November 17, 2025
షేక్ హసీనాకు మరణశిక్ష

బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. ఢాకా అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. గతేడాది విద్యార్థుల ఆందోళనల సమయంలో 1400 మంది చావుకు కారణమయ్యారని ఆమెతో పాటు మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం హసీనా భారత్లో తల దాచుకుంటున్నారు.


