News October 28, 2024
విద్యుత్ ఛార్జీల పెంపు లేదు: ఈఆర్సీ
TG: డిస్కంల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.50కి పెంచేందుకు ప్రతిపాదనలు చేయగా నిరాకరించింది. ఎనర్జీ ఛార్జీలు ఏ కేటగిరిలోనూ పెంచట్లేదని పేర్కొంది. సుధీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News October 28, 2024
ప్యాసింజర్ రైలులో పేలుడు.. నలుగురికి గాయాలు
హరియాణాలో రోహ్తక్ నుంచి ఢిల్లీ వెళుతున్న ప్యాసింజర్ రైలులో పేలుడు కలకలం రేపింది. పేలుడుకు మంటలు చెలరేగడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సంప్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రయాణికులు రైలులో పేలుడు స్వభావం ఉన్న పదార్థాలను తీసుకువెళ్లడంతో ఇలా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
News October 28, 2024
జగన్పై షర్మిల భర్త హాట్ కామెంట్స్
AP: జగన్కు మద్దతుగా పాదయాత్ర చేయాలని షర్మిలను భారతీనే అడిగారని ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘యాత్ర సందర్భంగా ఆమె పార్టీని ఎత్తుకుపోతోందని జగన్తో సజ్జల చెప్పారు. జగన్కు అప్పటి నుంచే అభద్రతాభావం మొదలైంది. మధ్యలో చాలామంది చిచ్చులు పెట్టారు. TGలో పార్టీ పెట్టాలని షర్మిలను PK అడిగారు. ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయని, KCRతో ఇబ్బంది అవుతుందని జగన్ వద్దన్నారు’ అని అనిల్ చెప్పారు.
News October 28, 2024
జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల
జేఈఈ మెయిన్స్ 2025-26కు షెడ్యూల్ను NTA విడుదల చేసింది. రెండు సెషన్స్గా పరీక్షలు జరగనున్నాయి. తొలి సెషన్ దరఖాస్తులకు నవంబర్ 22 వరకు గడువు ఉంది. జనవరి 22 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 12లోపు ఫలితాలు రానున్నాయి. రెండో సెషన్ దరఖాస్తులు ఫిబ్రవరిలో స్వీకరించనుండగా, ఏప్రిల్లో పరీక్షలు జరగనున్నాయి.