News February 20, 2025

విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు: ERC

image

AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని విద్యుత్ నియంత్రణ మండలి(ERC) ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ ప్రకటించారు. 2025-26 ఏడాదికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఛార్జీల టారిఫ్‌లను విడుదల చేసిన ఆయన, ఏ విభాగంలోనూ ఛార్జీల పెంపు లేదని స్పష్టం చేశారు. వచ్చే నెల 31లోపు టారిఫ్‌లు విడుదల చేయాల్సి ఉండగా, ముందుగానే ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు.

Similar News

News September 17, 2025

ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు

image

ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య పెరిగింది. అయితే హెయిర్‌లాస్ ఎక్కువ ఉంటే బియ్యం కడిగిన నీళ్లతో చెక్ పెట్టొచ్చు. బియ్యం నీటితో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు, విటమిన్‌ బీ, ఈ, సీలు జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. అలాగే రాత్రి బియ్యం నానబెట్టిన నీటిని వడకట్టి ఉదయాన్నే తలకు పట్టించి అరగంట తర్వాత కడుక్కోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

News September 17, 2025

అత్యధిక రెమ్యునరేషన్ ఈ హీరోయిన్లకే!

image

దక్షిణాదిన అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల వివరాలను ఇండియా టుడే తెలిపింది. నయనతార ఒక్కో సినిమాకు రూ.10+ కోట్లు తీసుకుంటారని పేర్కొంది. అలాగే సాయిపల్లవికి మూవీని బట్టి ₹20కోట్ల వరకు ఉంటుందని, ‘రామాయణ’ కోసం రూ.12కోట్లు డిమాండ్ చేశారంది. నేషనల్ క్రష్ రష్మిక ‘సికందర్‌’కి ₹13Cr, పుష్ప-2కి ₹10Cr కోట్లు తీసుకున్నారంది. ఇక తమన్న ప్రతి సినిమాకు ₹10కోట్లు వసూల్ చేస్తున్నారని తెలిపింది.

News September 17, 2025

వ్యవసాయం.. అంతర పంటలతో అధిక లాభం

image

ప్రధాన పంట వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలం వృథా కాకుండా పండించే మరో పంటను అంతర పంట అంటారు. ఈ విధానంలో ఒక పంట దెబ్బతిన్నా.. మరొకటి చేతికొస్తుంది. వాతావరణం అనుకూలిస్తే 2 పంటల నుంచి రైతు మంచి ఆదాయం పొందవచ్చు. దీని వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. కీటకాలు, తెగుళ్లు, కలుపు మొక్కల బెడద, నేలకోత తగ్గి.. భూమిలో పోషకాలు పెరిగే అవకాశం ఉంది. అంతర పంటల సాగు వల్ల వచ్చిన ఆదాయం ప్రధాన పంట పెట్టుబడికి సహాయపడుతుంది.