News May 11, 2024
ఎంత కష్టమైనా పోలింగ్ బూతుకెళ్లి ఓటేయండి: హీరో నిఖిల్

ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రికార్డు ఓటింగ్ పర్సంటేజ్ నమోదుకావాలని హీరో నిఖిల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని గ్రామాలకు వెళ్లే అన్ని రోడ్లు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ఎంత కష్టమైనా సరే మీ పోలింగ్ బూతుకి చేరుకొని ఓటేసి మీ స్వరాన్ని వినిపించాలని అభ్యర్థిస్తున్నా. ఓటింగ్ శాతంలో రికార్డులు నమోదవ్వాలి’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
Similar News
News February 2, 2026
జనవరిలో రికార్డు స్థాయి UPI లావాదేవీలు

జనవరి నెలలో దేశంలో UPI లావాదేవీలు రూ.28.33 లక్షల కోట్లకు చేరుకొని రికార్డు సృష్టించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) వెల్లడించింది. సంఖ్యాపరంగా చూస్తే 21.70 బిలియన్లుగా నమోదయ్యాయని తెలిపింది. డిసెంబర్ నెలలో నమోదైన రూ.27.97 లక్షల కోట్ల కంటే ఇది ఎక్కువ.
News February 2, 2026
కాళ్లు తెల్లగా అవ్వాలంటే..

చాలామంది ఇతర శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ పాదాలపై పెట్టరు. దీంతో ఇవి దీర్ఘకాలంలో నల్లగా మారిపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు చర్మ నిపుణులు. కాళ్లను తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్ రాయాలి. బయటికి వెళ్లేటపుడు సన్స్క్రీన్ రాయాలి. లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, విటమిన్ సి, హైడ్రోక్వినోన్లలో ఏదో ఒకటి ఉన్న లైటెనింగ్ క్రీములు వాడాలని సూచిస్తున్నారు.
News February 2, 2026
పాక్ ఉక్కిరిబిక్కిరి.. మహిళలే సూసైడ్ బాంబర్లుగా మారారు!

పాకిస్థాన్ అధీనంలోని బలూచిస్థాన్లో ఉద్రిక్తతలు చల్లారట్లేదు. పాక్ సైన్యంపై రెబల్స్ విరుచుకుపడుతున్నారు. మహిళలు సూసైడ్ బాంబర్లుగా మారి పాక్ సైన్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆసిఫా మెంగల్ (24) అనే సూసైడ్ బాంబర్, మరో మహిళా ఫైటర్ చేసిన దాడుల్లో 50 మంది చనిపోగా అందులో 17 మందికిపైగా పాక్ జవాన్లు ఉన్నారు. 200 మంది పాక్ జవాన్లను చంపామని, 17 మందిని బంధించామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.


