News May 11, 2024
ఎంత కష్టమైనా పోలింగ్ బూతుకెళ్లి ఓటేయండి: హీరో నిఖిల్

ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రికార్డు ఓటింగ్ పర్సంటేజ్ నమోదుకావాలని హీరో నిఖిల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ‘ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని గ్రామాలకు వెళ్లే అన్ని రోడ్లు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ఎంత కష్టమైనా సరే మీ పోలింగ్ బూతుకి చేరుకొని ఓటేసి మీ స్వరాన్ని వినిపించాలని అభ్యర్థిస్తున్నా. ఓటింగ్ శాతంలో రికార్డులు నమోదవ్వాలి’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
Similar News
News December 27, 2025
రేపు అయోధ్యకు చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు అయోధ్యకు వెళ్లనున్నారు. ప్రస్తుతం HYDలో ఉన్న ఆయన రేపు ఉదయం 9 గంటలకు రామ జన్మభూమికి వెళ్తారు. ఉ.11.30 నుంచి మ.2.30 వరకు రామమందిరంలో ఉంటారు. అనంతరం మ.3గంటలకు అయోధ్య నుంచి విజయవాడకు బయల్దేరుతారు. మరోవైపు ఈ నెల 30న సీఎం కుటుంబం విదేశీ పర్యటనకు వెళ్లనుందని తెలుస్తోంది. నాలుగు రోజుల వ్యక్తిగత పర్యటన అనంతరం తిరిగి వస్తారని సమాచారం.
News December 27, 2025
ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి

TG: గత పాలకులు తెలంగాణను దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైరయ్యారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ల సొంతింటి కలను నిజం చేస్తున్నామని తెలిపారు. ఖమ్మంలోని ఏదులాపురంలో మండల కార్యాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.
News December 27, 2025
ఇంటి వాస్తుకు పంచ భూతాల ప్రాముఖ్యత

వాస్తు శాస్త్రంలో పంచభూతాలైన భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, జలం సమతుల్యత చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘భూమి తత్వం ఇంటికి స్థిరత్వాన్ని, జలం ప్రశాంతతను, అగ్ని ఆరోగ్యం, శక్తిని, వాయువు సంబంధాలను ప్రభావితం చేస్తాయి. ఇంటి మధ్యభాగమైన బ్రహ్మ స్థానం సానుకూలతను నింపుతుంది. ఈ 5 ప్రకృతితో అనుసంధానమై ఉండటం వల్ల ఇంట్లోకి సుఖశాంతులు, ఐశ్వర్యం చేకూరుతాయి’ అని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


