News April 1, 2025
ఏం చేసినా జగన్ను విడిచి వెళ్లను: పేర్ని నాని

AP: కూటమి ప్రభుత్వం తమపై పాల్పడుతున్న కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. ఎన్ని వేధింపులకు గురిచేసినా జగన్ను విడిచివెళ్లనని స్పష్టం చేశారు. స్వయనా కూటమి మంత్రి వెళ్లి బియ్యాన్ని పట్టుకున్నా ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టలేదని విమర్శించారు. కాగా పేర్ని నాని సతీమణి జయసుధకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణ జరగనుంది.
Similar News
News October 17, 2025
విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి

AP: నిర్మాణ సంస్థ కె.రహెజా విశాఖలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. IT సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది. రూ.2,172కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నామని, మధురవాడలో 27 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 9,681మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఇటీవల విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
News October 17, 2025
అజిత్రోమైసిన్ సిరప్లో పురుగులు

మధ్యప్రదేశ్లో దగ్గు మందు మరణాల తర్వాత అజిత్రోమైసిన్ సిరప్లో పురుగులు రావడం కలకలం రేపుతోంది. గ్వాలియర్ జిల్లా మోరార్ ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చిన అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్లో పురుగులున్నాయని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని మిగిలిన 306 బాటిల్స్ను సీజ్ చేసి, టెస్ట్ కోసం శాంపిల్స్ భోపాల్ పంపారు. అది జనరిక్ మెడిసిన్ అని, MPలోని ఓ కంపెనీ తయారు చేస్తోందని అధికారులు వెల్లడించారు.
News October 17, 2025
కంచుకోటలు ఖాళీ అవుతున్నాయి!

బస్తర్, అబూజ్మడ్.. మావోయిస్టులకు కంచుకోటలు. ఎన్నో భీకర ఎన్కౌంటర్లకు వేదికలు. కానీ ఇప్పుడు అక్కడ తుపాకీ మూగబోతోంది. నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో వందల మంది మావోలు మరణించారు. దిక్కుతోచని స్థితిలో అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లాంటివారు కూడా లొంగిపోయారు. అబూజ్మడ్, నార్త్ బస్తర్ మావోరహిత ప్రాంతాలుగా మారాయని, ఇక మిగిలింది దక్షిణ బస్తరేనని అమిత్ షా ప్రకటించారు.