News August 6, 2024

ఆ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు: నిర్మలా సీతారామన్

image

జన్‌ధన్, పొదుపు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె ప్రసంగించారు. మరోవైపు గత ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచని అకౌంట్ల నుంచి రూ.8,500 కోట్ల ఫైన్ వసూలు చేసినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో తెలిపారు. ఇందులో 2023-24 ఏడాదిలోనే రూ.2,331 కోట్ల జరిమానా వసూలు చేశామన్నారు.

Similar News

News April 13, 2026

పాత ఇంట్లో దొరికిన నాణెం.. వేలంలో ₹1.2కోట్లు

image

బ్రిటన్‌ చరిత్రలోనే అత్యంత అందమైన నాణెంగా పేరుగాంచిన ‘యూనా అండ్ ది లయన్’ గోల్డ్ కాయిన్ వేలంలో £110,000 (సుమారు ₹1.2 కోట్లు) పలికింది. వేల్స్‌లోని ఒక పాత ఇంట్లో దొరికిన ఈ ఐదు పౌండ్ల నాణేన్ని 1839లో క్వీన్ విక్టోరియా పట్టాభిషేక జ్ఞాపకార్థం ముద్రించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 300 మాత్రమే ఉండటంతో కాయిన్ కలెక్టర్స్ దీనిని నాణేల ప్రపంచంలో ‘హోలీ గ్రెయిల్’(అత్యంత అరుదైనది)గా భావిస్తారు.

News April 13, 2026

బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

image

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.

News April 13, 2026

ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

image

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు