News November 20, 2024

‘ఛార్జీలకు డబ్బులు లేవు.. పోస్టులో పద్మశ్రీ పంపండి’

image

పద్మశ్రీ అవార్డు పొందిన అత్యంత పేదవాడైన ఒడిశాకు చెందిన కవి హాల్ధార్ నాగ్ వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఆయనకు 2016లో కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. అయితే, ఇది తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చేందుకు ఆయన వద్ద డబ్బులు లేవు. దీంతో ఆయన అవార్డును పోస్టులో పంపాలని విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు వైరలయ్యాయి. ఆయనకు కేవలం మూడు జతల బట్టలు, ఒక కాడలు లేని కళ్లజోడు, రూ.732 మాత్రమే ఉన్నాయి.

Similar News

News October 24, 2025

కర్నూలు బస్సు ప్రమాదం.. రాష్ట్రపతి దిగ్భ్రాంతి

image

AP: కర్నూలు <<18087387>>బస్సు ప్రమాదంపై<<>> రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మంత్రి లోకేశ్ ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇది గుండెలు పగిలే ఘటన అని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. మరోవైపు హోంమంత్రి అనిత ఘటనాస్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోయినట్లు సమాచారం.

News October 24, 2025

ఐరన్ మ్యాన్ పోటీల్లో రికార్డు సృష్టించిన రీనీ నోరోన్హా

image

ప్రపంచంలో అత్యంత కఠినమైన క్రీడాంశాల్లో ఒకటైన ఐరన్‌మ్యాన్‌ ట్రయథ్లాన్‌‌ను పూర్తి చేసి మన దేశంలో పిన్నవయస్కురాలైన మహిళా ఐరన్‌మ్యాన్‌గా చరిత్రకెక్కారు రీనీ నోరోన్హా. 19 ఏళ్ళ రీనీ 3.8 కి.మీ స్విమ్మింగ్‌, 180 కి.మీ బైక్‌ రైడ్‌, 42.2 కి.మీ రన్‌‌ ఈవెంట్లను పద్నాలుగు గంటల్లోనే పూర్తి చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈమె ప్రస్తుతం చెన్నై ఐఐటిలో డేటా సైన్స్‌ అప్లికేషన్స్‌లో డిగ్రీ చేస్తున్నారు.

News October 24, 2025

ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణాలు

image

*బైకును ఢీ కొట్టగానే బస్సును డ్రైవర్ ఆపకుండా కొంతదూరం తీసుకెళ్లాడు. *ఆ టైంలో బైకు పెట్రోల్ ట్యాంకు రాపిడితో మంటలు చెలరేగాయి. *మంటలను ఫైర్ సేఫ్టీ కిట్‌తో కాకుండా నీళ్లతో ఆర్పే ప్రయత్నంతో వ్యాప్తిని అడ్డుకోలేకపోయారు. *లగ్జరీ, ఏసీ బస్సు కావడం, సీటింగ్ ఫోమ్, త్వరగా అంటుకునే మెటీరియల్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. *అర్ధరాత్రి, పొగ కమ్మేయడంతో అద్దాలు పగులగొట్టి ప్రయాణికులంతా బయటకు రాలేకపోవడం.