News November 20, 2024
‘ఛార్జీలకు డబ్బులు లేవు.. పోస్టులో పద్మశ్రీ పంపండి’

పద్మశ్రీ అవార్డు పొందిన అత్యంత పేదవాడైన ఒడిశాకు చెందిన కవి హాల్ధార్ నాగ్ వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఆయనకు 2016లో కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. అయితే, ఇది తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చేందుకు ఆయన వద్ద డబ్బులు లేవు. దీంతో ఆయన అవార్డును పోస్టులో పంపాలని విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు వైరలయ్యాయి. ఆయనకు కేవలం మూడు జతల బట్టలు, ఒక కాడలు లేని కళ్లజోడు, రూ.732 మాత్రమే ఉన్నాయి.
Similar News
News November 27, 2025
అయోధ్య ఆలయంలో హైదరాబాద్ కిటికీలు

కంచన్బాగ్లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని) సంస్థ అయోధ్యలోని రామాలయం కోసం కిటికీలను తయారుచేసింది. టైటానియం ఆర్కిటెక్చరల్ విండోలను తయారుచేసి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేసినట్లు మిథాని అధికారులు తెలిపారు. 31 కీటికీలను తయారు చేసి ఆలయానికి ఇచ్చామని వివరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రదక్షణ కారిడార్ కోసం ఇంజినీరింగ్ విభాగం వీటిని తయారుచేసింది.
News November 27, 2025
రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

AP: రేషన్షాపులను విలేజ్ మాల్స్గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్తోపాటు పప్పులు, నూనెలు, గోధుమ పిండి, రవ్వ తదితర 15 రకాల వస్తువులను తక్కువ ధరకు ఇవ్వనుంది. దీనివల్ల రేషన్ డీలర్లకు అదనపు ఆదాయంతోపాటు పేదలకు లబ్ధిచేకూరుతుందని భావిస్తోంది. ఇప్పటికే రేషన్ డీలర్లతో చర్చించింది. మరోవైపు లబ్ధిదారులకు బియ్యం, షుగర్తోపాటు రాగులు, జొన్నలు, కొర్రలు నేటి నుంచి దశలవారీగా ప్రభుత్వం ఇవ్వనుంది.
News November 27, 2025
R.G.L- 7034 వరి రకం ప్రత్యేకతలు

R.G.L- 7034 సన్నగింజ వరి రకం. మొక్క ఎత్తు 100-105 సెం.మీ. దుబ్బుకు 10 నుంచి 14 పిలకలు వస్తాయి. వెయ్యి గింజల బరువు 14.5 గ్రాములు. చిట్టిముత్యాలు, NLR 34449 రకాలను క్రాసింగ్ చేసి R.G.L- 7034ను అభివృద్ధి చేశారు. బలమైన వేరు వ్యవస్థ కలిగి తుఫాన్ సమయంలో పడిపోలేదు. గింజ రాలడం తక్కువ. కాండం దృఢంగా ఉంటుంది. ఉల్లికోడు, దోమపోటు, మానిపండు తెగుళ్లను తట్టుకుంటుంది. హెక్టారుకు 6.5 టన్నుల దిగుబడి వస్తుంది.


