News April 5, 2024

ఇక ఓట్ల రాజకీయాలు చేయను: జగ్గారెడ్డి

image

TG: ఇక నుంచి తాను ఓట్ల కోసం రాజకీయాలు చేయనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ‘MLAగా గెలిచిన వారికి గౌరవం ఇవ్వాలి. నిధులు తెచ్చేది నేనే అయినప్పటికీ ప్రొటోకాల్ గెలిచిన ఎమ్మెల్యేకే ఉంటుంది. సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ గొడవలు ఉండొద్దు. రాష్ట్రంలో పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో నీలం మధును గెలిపించాలి’ అని కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Similar News

News November 4, 2025

కంపెనీకే 17ఏళ్ల జీవితాన్ని అంకితమిస్తే.. ఉద్యోగి ట్వీట్ వైరల్

image

అవిశ్రాంతంగా 17ఏళ్లు పనిచేసినా లేఆఫ్ ఇవ్వడంతో ఓ ఉద్యోగి చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘లేఆఫ్ బాధలో ఉన్న నేను పిల్లలను తొలిసారి స్కూల్‌కి తీసుకెళ్లా. అప్పుడు వారి నవ్వు చూసి నేను కోల్పోయిన సమయాన్ని గుర్తుచేసుకుంటే కన్నీళ్లు వచ్చాయి. కంపెనీలు త్యాగాలకు కాదు పనితీరుకే విలువనిస్తాయి’ అని రాసుకొచ్చారు. జీతమే ముఖ్యం కాదని, కుటుంబంతో గడిపే సమయం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.

News November 4, 2025

హైదరాబాద్‌లో మొదలైన వర్షం

image

TG: హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. మల్కాజ్‌గిరి, ఉప్పల్, కాప్రా, ఉస్మానియా యూనివర్సిటీ, నాచారం, తార్నాక, సికింద్రాబాద్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కాసేపట్లో ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, చార్మినార్, నాంపల్లి, రాజేంద్రనగర్ ఏరియాల్లోనూ వాన పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

News November 4, 2025

122 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>NPCIL<<>>) 122 డిప్యూటీ మేనేజర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 7 నుంచి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. డిప్యూటీ మేనేజర్ పోస్టుకు నెలకు రూ.56,100, జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టుకు నెలకు రూ.35,400 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://npcilcareers.co.in