News April 4, 2025
బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దు: CM చంద్రబాబు

AP: బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యాధి నిరోధకశక్తి లేకపోవడం, లెప్టోస్పీరోసిస్ తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సోకి ఇటీవల ఓ బాలిక మృతి చెందిందని చెప్పారు. దీనిపై ICMR బృందం అధ్యయనం చేసిందన్నారు. కాగా ఆ బృందంతో సీఎం ఇవాళ సమీక్షించారు.
Similar News
News April 12, 2025
దక్షిణాఫ్రికా ఆటగాడిపై PSLలో నిషేధం

సౌతాఫ్రికా ఆల్రౌండర్ కార్బిన్ బోష్పై పాకిస్థాన్ సూపర్ లీగ్ నిషేధం విధించింది. ఈ ఏడాది టోర్నీ కోసం పెషావర్ జల్మీ జట్టు అతడిని కొనుగోలు చేసింది. అయితే ముంబై ఇండియన్స్ ఆటగాడు లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో అతడి రీప్లేస్మెంట్గా కార్బిన్ను MI తీసుకుంది. ఈ నేపథ్యంలో PSL నుంచి కార్బిన్ వైదొలిగారు. దీంతో వచ్చే ఏడాదికి కార్బిన్ను నిషేధిస్తున్నట్లు PSL యాజమాన్యం ప్రకటించింది.
News April 12, 2025
రొయ్యల మేత ధర కిలోకు రూ.4 తగ్గింపు

AP: పెరిగిన ఖర్చులు, ఎగుమతి కౌంట్ రేట్లు తగ్గిన నేపథ్యంలో ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో రొయ్యల మేత ధరను కిలోకు ₹4 చొప్పున ఫీడ్ కంపెనీలు తగ్గించాయి. <<16027501>>సీఎం చంద్రబాబు<<>> ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, నేటి నుంచి అమలు చేస్తామని వెల్లడించాయి. అయితే కిలోకు ₹20-25 తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కాగా రొయ్యల ధరలను తగ్గించొద్దని వ్యాపారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
News April 12, 2025
ALERT: వడగాలులు బాబోయ్!

AP: రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నప్పటికీ వడగాలుల తీవ్రత మాత్రం పరాకాష్ఠకు చేరింది. మధ్యాహ్నవేళల్లో బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఆ తీవ్రత కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈరోజు 66 మండలాల్లో వడగాడ్పులు వీయొచ్చని తెలిపింది. అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.