News February 21, 2025

జగన్ ఐ ప్యాక్ డ్రామాలు ఎవరూ నమ్మరు: మంత్రి కొల్లు

image

AP: కిడ్నాపులు చేసిన వారిపై కేసులు పెట్టడం తప్పా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ నేరస్థులను వెనకేసుకురావడం దారుణమన్నారు. ‘జగన్ చేసిన తప్పులను ప్రశ్నిస్తామనే అసెంబ్లీకి రావడం లేదు. ప్రజలు నడి రోడ్డు మీద నిలబెట్టినా ఆయనలో ఇంకా మార్పు రాలేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ గుంటూరు మిర్చి యార్డులో రాద్ధాంతం చేశారు. ఆయన ఐ ప్యాక్ డ్రామాలను ఎవరూ నమ్మరు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News November 20, 2025

పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయా? ఇలా తెలుసుకోండి!

image

నిన్న ప్రధాని మోదీ పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.18వేల కోట్లు జమ చేశారు. భూమి వివరాలు PM-KISAN పోర్టల్‌లో నమోదై ఉండి, బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉన్న రైతులకే ఈ స్కీమ్ ప్రయోజనాలు అందనున్నాయి. https://pmkisan.gov.in/లోకి వెళ్లి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో, లేదో తెలుసుకోవచ్చు.

News November 20, 2025

దేశవ్యాప్తంగా సన్న బియ్యం ఇవ్వాలని కేంద్ర మంత్రికి CM విజ్ఞప్తి

image

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి CM రేవంత్‌ వివరించారు. HYDలో ఆయనతో సీఎం భేటీ అయ్యారు. ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని, దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశాన్ని పరిశీలించాలని కోరారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు.

News November 20, 2025

హన్స్‌రాజ్ కాలేజీలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

హన్స్‌రాజ్ కాలేజీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో 24 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, Lab అసిస్టెంట్, Jr అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, Lab అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా, మిగతా పోస్టులకు 32ఏళ్లు. వెబ్‌సైట్: hansrajcollege.ac.in/