News July 22, 2024

ఢిల్లీలో జగన్ విన్యాసాలు పట్టించుకునే వారెవరూ లేరు: మంత్రి

image

AP: కేంద్ర సహకారంతో రాష్ట్రానికి ఎక్కువ నిధులు సాధిద్దామని బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఏపీకి అన్ని విధాలా సహకారానికి కేంద్రం సిద్ధంగా ఉంది. నిధుల కొరతను అధిగమించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దాం. జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే భంగపాటు తప్పదు. ఢిల్లీలో జగన్ ఎన్ని విన్యాసాలు చేసినా పట్టించుకునే వారు లేరు’ అని అన్నారు.

Similar News

News October 26, 2025

అష్ట ధర్మములు ఏవంటే?

image

1. యజ్ఞాలు చేయడం, 2. వేదాలు చదవడం,
3. దానాలు చేయడం, 4. తపస్సు చేయడం,
5. సత్యాన్నే పలకడం, 6. సహనం పాటించడం,
7. కష్ట సమయాల్లో నిలకడ, ధైర్యంగా ఉండటం,
8. వివేకం, ముందుచూపుతో వ్యవహరించడం.
ఈ ఎనిమిది ధర్మాలను పాటించడం వలన మనిషి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
<<-se>>#Sankhya<<>>

News October 26, 2025

చనిపోయిన స్నేహితుడిపై ఎర్రిస్వామి ఫిర్యాదు

image

బైక్ ప్రమాదంలో చనిపోయిన శివశంకర్‌పై అతడి స్నేహితుడు ఎర్రిస్వామి కర్నూలు (D) ఉలిందకొండ PSలో ఫిర్యాదు చేశాడు. ‘నేను, శివశంకర్ మద్యం సేవించాం. అతడి నిర్లక్ష్యం వల్లే ఇద్దరం కిందపడిపోయాం. శివ స్పాట్‌లో చనిపోయాడు. డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించాను. మా <<18102090>>బైకును<<>> మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది. దీంతో బస్సు బైకును లాక్కెళ్లింది’ అని తెలిపాడు. దీంతో శివపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 26, 2025

వంటింటి చిట్కాలు

image

☛ ఇడ్లీ పిండి పులవకుండా ఉండాలంటే ఆ పిండిపై తమలపాకు ఉంచండి.
☛ క్యాబేజీ ఉడికించేటప్పుడు వచ్చే వాసన కొందరికి నచ్చదు. అప్పుడు చిన్న అల్లం ముక్క వేస్తే ఆ వాసన తగ్గుతుంది.
☛ అల్లం వెల్లుల్లి ముద్ద చేసేటప్పుడు చెంచా వంటనూనె చేర్చితే.. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
☛ కొత్త బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు మట్టివాసన వస్తుంటే నాలుగు పుదీనా ఆకులు వేయండి. వాసన పోయి కూరకు సువాసన వస్తుంది.