News September 12, 2025
డయేరియాతో ఎవరూ మరణించలేదు: మంత్రి సత్యకుమార్

AP: విజయవాడలో ఇప్పటివరకు 141 డయేరియా కేసులు నమోదైనట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ వ్యాధితో నగరంలో ఎవరూ మరణించలేదని ఆయన చెప్పారు. న్యూరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను మంత్రి నారాయణ, MP చిన్నితో కలిసి ఆయన పరామర్శించారు. ‘ఇంటింటి సర్వే చేసి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. బుడమేరు ప్రాంతంలోని భూగర్భజలాలు కలుషితం అయ్యాయేమోనన్న అనుమానం ఉంది’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News September 12, 2025
Way2News ఉత్తరాదిలోనూ రాణించాలి: చంద్రబాబు

డిజిటల్ మీడియా రంగంలో వే2న్యూస్ జాతీయ స్థాయిలో రాణించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ‘వే2న్యూస్ ఓ స్టార్టప్ కంపెనీ. నాలెడ్జ్ ఎకానమీలో 19 ఏళ్ల క్రితమే ఫౌండర్ రాజు వనపాల వినూత్న ఆలోచన చేశారు. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో వే2న్యూస్ రాణిస్తోంది. ఉత్తర భారతదేశంలో డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అని Way2News కాన్క్లేవ్లో సీఎం అన్నారు.
News September 12, 2025
BIG ALERT: రేపు అతిభారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News September 12, 2025
వేప మందులను ఇలా వాడితే ఎక్కువ లాభం

పంటల్లో వేపనూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు హానిచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.