News May 11, 2024

పోలింగ్ బూత్‌లలోకి ఫోన్ల అనుమతి లేదు: సీఈవో ముకేశ్

image

AP: పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో పార్టీలు ఎలాంటి సింబల్స్ లేకుండా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసుకోవచ్చని CEO ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ‘పోలింగ్ కేంద్రంలో ఒక పార్టీకి ఒక ఏజెంట్ మాత్రమే ఉండాలి. ప్రిసైడింగ్ అధికారి తప్ప మిగతా ఎవరూ బూత్‌లోకి ఫోన్లు తీసుకెళ్లకూడదు. నేతలు ఓటర్లను వాహనాల్లో తరలించకూడదు. ఓటింగ్ శైలిని పర్యవేక్షించుకునేందుకు అభ్యర్థి 3 వాహనాలు ఉపయోగించుకోవచ్చు’ అని తెలిపారు.

Similar News

News November 14, 2025

23వేల ఆధిక్యంలో నవీన్ యాదవ్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ లీడ్ భారీగా పెరుగుతోంది. 8వ రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ 23వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా 8 రౌండ్లలో ఆయన లీడ్ సాధించడం విశేషం. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి.

News November 14, 2025

ఆ భవనాలు IT Hub కోసం కాదు: అధికారులు

image

TG: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాలను ఐటీ హబ్ కోసం ఉపయోగిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. అవి తప్పుడు వార్తలని స్పష్టం చేశారు. అధునాతన ఆరోగ్య సేవలను అందించడానికి ప్రభుత్వం త్వరలో సనత్‌నగర్ TIMS, వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 14, 2025

రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ప్రశాంత్ కిశోర్.. జోరుగా చర్చ

image

బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ జన్ సురాజ్ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. 25 కంటే ఎక్కువ సీట్లను జేడీయూ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పీకే శపథం చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం జేడీయూ 25 సీట్లను సునాయాసంగా గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ ఒత్తిడి చేయడం వల్లే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందని జన్ సురాజ్ నేత అనుకృతి పేర్కొన్నారు.