News February 23, 2025
వాయిదా లేదు.. నేడే గ్రూప్-2 మెయిన్స్

AP: తీవ్ర ఆందోళనలు, సంచలన నిర్ణయాలు, నాటకీయ పరిణామాల మధ్య నేడు గ్రూప్-2 మెయిన్స్ యథావిధిగా జరగనుంది. పరీక్ష వాయిదా వేశారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని APPSC మరోసారి తేల్చి చెప్పింది. 175 కేంద్రాల్లో 92,250 మంది మెయిన్స్ రాయనున్నారు. ఉ.10 గంటల నుంచి మ.12.30 గంటల వరకు పేపర్-1, మ.3 గంటల నుంచి సా.5.30 గంటల వరకు పేపర్-2 జరగనుంది. అభ్యర్థులు ఉ.9.30 గంటలలోపు కేంద్రాలకు చేరుకోవాలి.
Similar News
News November 27, 2025
హసీనా అప్పగింతపై పరిశీలిస్తున్నాం: భారత్

భారత్లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింతపై అక్కడి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, శాంతి, ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంటుందన్నారు. తీవ్ర నేరాలు చేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన ప్రత్యేక ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది.
News November 27, 2025
ఆకుకూరల సాగుకు అనువైన రకాలు

ఈ కింద సూచించిన ఆకుకూరల రకాలు మన ప్రాంతంలో సాగుకు అనుకూలం. వీటిని సరైన యాజమాన్యాన్ని పాటిస్తూ సాగు చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
☛ కొత్తిమీర: సిందు సాధన, స్వాతి, సుధా, సుగుణ, సురచి(LCC-234), APHU ధనియా-1 (వేసవి రకం), సుస్థిర
☛ కరివేపాకు: సువాసిని, భువనేశ్వర్, సెంకంపు
☛ మునగ: జాఫ్నా(ఇది బహువార్షిక రకం), పి.కె.యం-1( ఇది ఏక వార్షిక రకం)
News November 27, 2025
ఆయన 3 కాలాలకు ఏకైక పాలకుడు..

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః|
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః||
విశ్వమంతా విష్ణువుతో నిండి ఉందని ఈ శ్లోకం ప్రకటిస్తుంది. ఆయన 3 కాలాలకు ఏకైక పాలకుడు. ఈ జగత్తును సృష్టించి, భరించి, పోషించే శక్తిమంతుడు. సమస్త జీవులలో కొలువై ఉన్నాడు. సకల భూతాలకు ప్రాణమిచ్చి, పోషిస్తున్నాడు. అందుకే ఆయనను ఆరాధిస్తే వెంటనే అనుగ్రహించి, మన కష్టాలను దూరం చేస్తాడని అంతా నమ్ముతారు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


