News July 3, 2024
రాష్ట్రంలో పవర్ కట్స్ లేవు: భట్టి

TG: రాష్ట్రంలో పవర్ కట్స్ లేవని, కేవలం విద్యుత్ అంతరాయాలు మాత్రమే ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా చిట్చాట్లో తెలిపారు. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్లోకి రమ్మని మేం అడగడం లేదు. కేసీఆర్ అన్యాయాన్ని అరికట్టాలని వారే వస్తున్నారు. త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. పీసీసీ నియామక కసరత్తు మొదలైంది. ప్రజలు కోరుకుంటే కొండలు, గుట్టలకూ రైతు భరోసా ఇస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News October 28, 2025
ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల లాభమేంటి?

కలుపు నివారణలో మల్చింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్లాస్టిక్ షీటును మొక్క చుట్టూ నేలపై కప్పడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేల తేమను నిలుపుకుంటుంది. కలుపు కట్టడి జరుగుతుంది. పంట ఏపుగా పెరిగి దిగుబడి బాగుంటుంది. కూరగాయల సాగుకు ఇది అనుకూలం. మల్చింగ్ చేసిన ప్రాంతంలో పంటకాలం పూర్తయ్యాక దున్నాల్సిన అవసరం లేకుండా పాత మొక్కలను తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటుకోవచ్చు.
News October 28, 2025
BREAKING: మచిలీపట్నానికి 160km దూరంలో ‘మొంథా’

AP: ‘మొంథా’ తుఫాను తీరంవైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదిలినట్లు APSDMA తెలిపింది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 160KM, కాకినాడకు 240KM, విశాఖపట్నానికి 320KM దూరంలో కేంద్రీకృతమైనట్లు వివరించింది. తుఫాను ప్రభావాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వివరించింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.
News October 28, 2025
10లక్షల మందికి యోగా గురువు ‘నానమ్మల్’

యోగాతోనే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన నానమ్మల్ అనేక పురాతన యోగా శాసనాలను భావితరాలకు పంచారు. 1972లో యోగాసెంటర్ ప్రారంభించి 10L మందికిపైగా యోగా నేర్పారు. వారు దేశవిదేశాల్లో యోగాగురువులుగా స్థిరపడ్డారు. ఆమె చేసిన కృషికిగాను 2016లో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి, 2019లో పద్మశ్రీతో సత్కరించింది. 99 ఏళ్ల వయసులో మరణించిన ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
✍️ ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.


