News April 21, 2024
సీఏఏను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు: రాజ్నాథ్

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘బెంగాల్ సీఎం మమత సీఏఏపై ముస్లింలలో అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాలకు సీఏఏను ఆపే అధికారం లేదు. మమత పార్టీ తీవ్ర అవినీతిలో కూరుకుపోయింది. కానీ పదేళ్ల మా ప్రభుత్వంలో ఒక్క అవినీతి మచ్చ లేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News February 20, 2026
కొత్త బాస్లు వీరేనా?

TG: వచ్చేనెలలో CS రామకృష్ణారావు పదవీకాలం ముగియనుండగా వికాస్ రాజ్, జయేశ్ రంజన్, సవ్యసాచి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జయేశ్కు అడ్మినిస్ట్రేషన్పై పట్టుండటంతో CM సానుకూలంగా ఉన్నారు. వచ్చే ఏడాదే ఆయనతో పాటు సవ్యసాచి రిటైర్మెంట్ కానుండటం ప్రతికూలంగా మారింది. 2028 వరకు సర్వీస్ ఉన్న వికాస్కు ఎక్కువ ఛాన్సుంది. రామకృష్ణారావు పొడిగింపుపైనా ఆలోచిస్తోంది. DGP నియామకంలో CV ఆనంద్ పేరు వినిపిస్తోంది.
News February 20, 2026
పంటలను నాశనం చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు

పంటలపై ఆఫ్రికన్ నత్తల దాడుల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి. ఇవి పొలాలు, తోటల్లో చేరి మొక్కల ఆకులు, కాయలు, పండ్లను తినడం వల్ల తీవ్ర పంట నష్టం కలగడంతో పాటు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా బొప్పాయి, మామిడి, అరటి, కాఫీ, రబ్బరు, పత్తి, రాగులు, కొబ్బరి, పొద్దుతిరుగుడు, అపరాలు, నూనెగింజలు, వంగ, దోస, క్యాబేజి, బెండ, మల్బరీ, బంతి తోటల్లో వీటి ముప్పు ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు.
News February 20, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్లో 28 పోస్టులు

CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 28 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మార్చి 11, 12తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, MMV, డ్రాఫ్స్మెన్ మెకానికల్కు నెలకు స్టైపెండ్ రూ.10,560, వెల్డర్కు రూ.9600 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.nal.res.in


