News December 2, 2024
విద్యుత్ అంతరాయం ఉండొద్దు: మంత్రి గొట్టిపాటి

AP: తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాలు తగ్గేవరకు అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మధ్యాహ్నానికి విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తిచేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించారు.
Similar News
News January 23, 2026
చిరు వ్యాపారులకు స్వనిధి క్రెడిట్ కార్డులు

వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘స్వనిధి క్రెడిట్ కార్డు’లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డులను పీఎం మోదీ ఈరోజు కేరళలో లాంచ్ చేశారు. <<17535471>>పీఎం స్వనిధి స్కీమ్<<>>లో భాగంగా రెండో విడత లోన్ తీసుకుని సకాలంలో చెల్లించిన వ్యాపారులకు ఈ క్రెడిట్ కార్డు ఇస్తారు. ఇది UPI లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు. మ్యాగ్జిమమ్ లిమిట్ రూ.30వేలు. వ్యాలిడిటీ 5ఏళ్లు ఉంటుంది. కార్డు కోసం లోన్ ఇచ్చిన బ్యాంకులో సంప్రదించాలి.
News January 23, 2026
అర్ష్దీప్ బౌలింగ్.. 2 ఓవర్లలోనే 36 రన్స్

భారత్తో రెండో టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు అర్ష్దీప్ వేసిన రెండు ఓవర్లలో 36 రన్స్ బాదారు. తొలి ఓవర్లో కాన్వే 3 ఫోర్లు, ఒక సిక్స్తో 18 పరుగులు, 3 ఓవర్లో సీఫెర్ట్ చివరి 4 బంతుల్లో 4 ఫోర్లు బాదారు. 4వ ఓవర్ను హర్షిత్ మెయిడెన్ వేసి కాన్వే వికెట్ తీశారు. ఐదో ఓవర్లో వరుణ్ చక్రవర్తి 2 పరుగులిచ్చి సీఫెర్ట్ను ఔట్ చేశారు. అయితే హర్షిత్ వేసిన 6వ ఓవర్లో 19 పరుగులొచ్చాయి. 6 ఓవర్లకు NZ స్కోర్ 64/2.
News January 23, 2026
విచారణలో రాధాకిషన్ ఎంట్రీ..? KTR రిప్లై ఇదే!

TG: ఫోన్ ట్యాపింగ్పై తనను విచారించే సమయంలో మాజీ DCP రాధాకిషన్ రావును పిలిపించారనేది అవాస్తవమని KTR స్పష్టం చేశారు. ‘అక్కడ తారకరామారావు తప్ప మరే రావు లేడు. ప్రభుత్వం కుట్రతో ఇచ్చే ఇలాంటి లీకులను మీడియా వెరిఫై చేయకుండా ప్రజలకు చెప్పవద్దు’ అని కోరారు. కాగా SIT ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ అంతా అధికారులే చూసుకున్నారని KTR చెప్పడంతో రాధాకిషన్ను రప్పించి ఎదురెదురుగా విచారించారని ప్రచారం జరిగింది.


