News September 7, 2024
అలాంటి స్టూడెంట్స్కు పనిష్మెంట్ వద్దు: విద్యాశాఖ

TG: రాఖీలు, తిలకం, మెహిందీ వంటి వాటితో స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు పనిష్మెంట్ ఇవ్వొద్దని విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి వాటితో వచ్చే కొందరు స్టూడెంట్స్ను కార్పొరల్ పనిష్మెంట్ పేరిట వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒకవేళ అలాంటి ఘటనలు జరిగినట్లు తేలితే ఆర్టీఈ యాక్ట్-2009 సెక్షన్-17 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 15, 2026
నేడు శివరాత్రి.. ఏ రంగు దుస్తులు ధరించాలంటే?

మహా శివరాత్రి రోజున డార్క్ రంగు దుస్తులు ధరించకపోవడం ఉత్తమం అంటున్నారు పండితులు. నలుపు, నీలి రంగు దుస్తులు ధరించడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ రంగులు ప్రతికూల ప్రభావం చూపుతాయట. అలాగే వీటితో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. శివరాత్రి రోజు పూజ చేసే సమయంలో తెలుపు/పసుపు రంగు దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఇలా పూజ చేస్తే శివానుగ్రహం కలిగి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు.
News February 15, 2026
ఎగ్జిమ్ బ్యాంక్లో 40 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 15, 2026
కెప్టెన్సీ నుంచి ధోనీని బలవంతంగా తప్పించిన బీసీసీఐ!

2017లో భారత జట్టు కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడానికి గల కారణాలను మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపే తాజాగా వెల్లడించారు. కెప్టెన్గా దిగిపోవాలని అప్పటి చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్, తాను కోరినట్లు తెలిపారు. అందుకు MS అంగీకరించారని, రాతపూర్వకంగా తెలియజేయాలని కోరితే ఈమెయిల్ పంపారని చెప్పారు. ఆ తర్వాత కోహ్లీకి మద్దతుగా నిలిచారని కొనియాడారు. 2014లో టెస్టులకు, 2020 ODI, T20లకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించారు.


