News July 3, 2024
బుద్ధి ఉన్నోళ్లెవరూ అమరావతిని తిరస్కరించరు: సీఎం చంద్రబాబు

AP: బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరైనా రాష్ట్ర రాజధానిగా అమరావతిని కాదనలేరని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ మూలకైనా సమాన దూరంలో ఉండేలా అమరావతి ప్రాంతాన్ని ఎంచుకున్నామని స్పష్టం చేశారు. తమ అధ్యయనంలో అత్యధిక శాతం మంది విజయవాడ, గుంటూరు మధ్యలోనే రాజధాని ఉండాలని చెప్పారని, ఆ విధంగానే ముందుకెళ్లామని వివరించారు.
Similar News
News February 6, 2026
సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎంకే మీనా?

AP: సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా నియమితులు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన గనులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గానూ విధులు నిర్వర్తించారు. కాగా ఇప్పటివరకు CM ముఖ్యకార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు TTD EOగా అదనపు బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న TTD EO సింఘాల్ను బదిలీ చేశారు.
News February 6, 2026
30వారాల గర్భాన్ని తొలగించేందుకు సుప్రీం అనుమతి!

బాయ్ ఫ్రెండ్ వల్ల 17ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయిన ఓ అమ్మాయి 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు సదరు యువతికే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇష్టం లేని గర్భాన్ని దాల్చాలని ఏ స్త్రీని బలవంతం చేయలేమని జడ్జీలు పేర్కొన్నారు. బాధితురాలి మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని వెంటనే అబార్షన్ చేయాలని కోర్టు ఆదేశించింది.
News February 6, 2026
స్మృతి మంధాన ‘రాయల్’ విజయం!

వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులకు కుంగిపోకుండా, పట్టుదలతో పోరాడి RCBని మరోసారి విజేతగా నిలిపారు స్మృతి మంధాన. మానసిక వేదనను పక్కన పెట్టి, మైదానంలో పరుగుల వరద పారిస్తూ ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకోవడం ఆమె సంకల్పానికి నిదర్శనం. పడిలేచిన కెరటంలా పుంజుకున్న ఆమె ప్రయాణం.. నిరాశలో కూరుకుపోతున్న ఎందరికో ఆదర్శం. ఈ విజయం కప్పు మాత్రమే కాదు, ఆమె ఆత్మవిశ్వాసానికి అభిషేకం.. మనోనిబ్బరానికి మరో మజిలీ.!


