News September 22, 2024
ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకూ పాక్తో చర్చలుండవు: అమిత్ షా
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేవరకూ ఆ దేశంతో చర్చలు జరిపేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. జమ్మూకశ్మీర్లో ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ‘కశ్మీర్లో త్రివర్ణ పతాకం మాత్రమే ఎగురుతుంది. పాక్తో మాట్లాడాలని ప్రతిపక్షాలంటున్నాయి. ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోయేవరకు అది జరగని పని. బీజేపీ మీకు హామీ ఇస్తోంది. ఒక్క ఉగ్రవాదిని కూడా విడిచిపెట్టం’ అని స్పష్టం చేశారు.
Similar News
News September 23, 2024
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మేడ్చల్, మెదక్, నాగర్కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, భువనగిరి, సూర్యాపేటలో మోస్తరు వర్షాలు పడతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News September 23, 2024
మెగాస్టార్కు రాజమౌళి అభినందనలు
మెగాస్టార్ చిరంజీవికి దర్శక ధీరుడు రాజమౌళి అభినందనలు తెలియజేశారు. తన కెరీర్లో 24 వేల డాన్స్ మూవ్స్ చేశారని ఇప్పుడే చదివినట్లు ట్వీట్ చేశారు. 46 ఏళ్ల అసాధారణ ప్రయాణం అద్భుతమని కొనియాడారు. భారత చిత్ర సీమలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటుడిగా గిన్నిస్ రికార్డు సాధించినందుకు కంగ్రాట్స్ తెలిపారు.
News September 23, 2024
వారికే జిల్లా అధ్యక్ష పదవులు: సీఎం రేవంత్
TG: బీసీ కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అని సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే జనాభాను లెక్కించాల్సిందేనన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్ నేతృత్వంలో సబ్ కమిటీ వేస్తామన్నారు. సుప్రీం తీర్పును అధ్యయనం చేస్తూ సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్పారు. ప్రజల్లో ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని సూచించారు. జమిలి ఎన్నికల అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.