News September 29, 2024

సంపద సృష్టి లేదు.. అంతా దోపిడీనే: VSR

image

AP: కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టి లేదని, అంతా దోపిడీయేనని MP విజయసాయిరెడ్డి అన్నారు. ‘మళ్లీ ₹3000కోట్ల అప్పు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం దాదాపు ₹50,000crపైగా అప్పు తెచ్చింది. చంద్రబాబు CM అయ్యే నాటికి ఖజానాలో ₹7000cr ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చిన డబ్బు కూడా ఉంది. కానీ జగన్ అమలు చేసిన 38 సంక్షేమ పథకాల్లో ఒక్కటి కూడా CBN కొనసాగించట్లేదు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 11, 2025

ఆజన్మబ్రహ్మచారి ఆంజనేయుడు!

image

ఆంజనేయుడు ఆజన్మ బ్రహ్మచారిగా ప్రసిద్ధి. అయితే హనుమంతుడు కూడా వివాహం చేసుకున్నట్లు కొందరు పండితులు చెబుతున్నారు. అయినా కూడా ఆంజనేయుడు బ్రహ్మచారేనని అంటారు. ఈ వైరుధ్యాలు ఏంటి? హనుమంతుడికి వివాహమైతే బ్రహ్మచారిగానే ఎందుకు పిలవబడుతున్నట్లు? ఈరోజు అనగనగాలో..
<<-se>>#anaganaga<<>>

News December 11, 2025

సర్పంచ్‌గా గెలిచిన చనిపోయిన అభ్యర్థి

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర సన్నివేశం వెలుగు చూసింది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా RRకాలనీ సర్పంచ్‌గా ఇటీవల మరణించిన చర్ల మురళి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై సుమారు 300కుపైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. నామినేషన్ అనంతరం మురళి మరణించడంతో గ్రామస్థులు ఆయనకే ఓటు వేశారు. దీంతో ఎన్నికల ఫలితంపై ఏం చేద్దామన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

News December 11, 2025

చనిపోయిన సర్పంచి అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

image

TG: మరణించిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి పలువురు అభిమానాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ మండలం నడివాడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన బుచ్చిరెడ్డి ఈ నెల 9న గుండెపోటుతో మరణించారు. ఎన్నికల్లో అధికారులు ఆయనకు బ్యాట్ గుర్తు కేటాయించారు. ఇవాళ జరిగిన పోలింగ్‌లో బుచ్చిరెడ్డికి 165 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి మరణించినా ఓటు వేయడం గమనార్హం.