News September 29, 2024
సంపద సృష్టి లేదు.. అంతా దోపిడీనే: VSR

AP: కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టి లేదని, అంతా దోపిడీయేనని MP విజయసాయిరెడ్డి అన్నారు. ‘మళ్లీ ₹3000కోట్ల అప్పు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం దాదాపు ₹50,000crపైగా అప్పు తెచ్చింది. చంద్రబాబు CM అయ్యే నాటికి ఖజానాలో ₹7000cr ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చిన డబ్బు కూడా ఉంది. కానీ జగన్ అమలు చేసిన 38 సంక్షేమ పథకాల్లో ఒక్కటి కూడా CBN కొనసాగించట్లేదు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 12, 2025
జట్టులో సూర్య, గిల్ అవసరమా?

T20ల్లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నా కెప్టెన్, వైస్ కెప్టెన్ అనే కారణంతో సూర్య, గిల్ కంటిన్యూ అవుతున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గత 14 T20ల్లో గిల్ 263 పరుగులే చేశారని, అటు తన చివరి 20 మ్యాచుల్లో SKY కేవలం 227 రన్సే కొట్టారని చెబుతున్నారు. వీళ్ల కోసం ఫామ్లో ఉన్న శాంసన్, జైస్వాల్ బలవుతున్నారని SMలో పోస్టులు పెడుతున్నారు. వీరిని టీం నుంచి తొలగించాలనే డిమాండ్లు విన్పిస్తున్నాయి. దీనిపై మీ COMMENT.
News December 12, 2025
ప్రతి ఇంట్లో గంగా జలం ఎందుకు ఉండాలి?

ప్రతి ఇంట్లో గంగా జలం తప్పనిసరిగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల సానుకూల శక్తితో గృహంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని అంటున్నారు. ‘గంగాజలం ఎప్పటికీ పాడవదు. ఎన్నేళ్లైనా గంగాజలాన్ని నిరభ్యంతరంగా ఇంట్లో ఉంచుకోవచ్చు. పూజలు, శుభకార్యాల సమయంలో ఉపయోగించవచ్చు. ఇల్లు కడిగేటప్పుడు, ఇంటికి సున్నం వేసే నీటిలో కొద్ది గంగా జలం వినియోగిస్తే.. ఏ ప్రతికూల శక్తి ప్రవేశించదు’ అని అంటున్నారు.
News December 12, 2025
చిలగడదుంపలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

శీతాకాలంలో దొరికే చిలగడదుంపలు పోషకాల పవర్ హౌస్ అని వైద్యులు చెబుతున్నారు. ‘వీటిలోని బీటా కెరోటిన్ కంటి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పెద్దమొత్తంలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. అలాగే ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీర వాపులను, నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మనల్ని రక్షిస్తాయి’ అని అంటున్నారు.


