News December 1, 2024
బఫర్ జోన్లలో నిర్మాణాలకు NOC.. రూ.కోట్లలో AEE అక్రమార్జన!

TG: నీటిపారుదల శాఖ <<14752463>>ఏఈఈ నిఖేశ్ అక్రమాలు<<>> వెలుగులోకి వస్తున్నాయి. HYD శివార్లలోని బఫర్ జోన్లలో భారీ నిర్మాణాలకు, విలువైన భూములకు అక్రమంగా NOC జారీ చేసి అతను జేబులు నింపుకున్నట్లు సమాచారం. రంగారెడ్డి మైనర్ ఇరిగేషన్లో పనిచేస్తుండగా అతనిపై చాలా ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో నిఖేశ్ ఎవరికైనా బినామీనా? అనే కోణంలోనూ ACB దర్యాప్తు చేస్తోంది.
Similar News
News December 3, 2025
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <
News December 3, 2025
పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే?

పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటూ, ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొదటి ఆరునెలలు తల్లిపాలు, తర్వాత రెండేళ్ల వరకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్తో కూడిని పోషకాహారం అందిస్తే ఇమ్యునిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అయోడిన్, ఐరన్ లోపం రాకుండా చూసుకోవాలంటున్నారు. వీటితో పాటు సమయానుసారం టీకాలు వేయించడం తప్పనిసరి.
News December 3, 2025
అమరావతికి రాజధాని హోదా.. కేంద్రం సవరణ బిల్లు

AP: అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రం సవరణ బిల్లును తీసుకొస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడుతుంది.


