News February 20, 2025

టీచర్లకు 45 కాదు ఒకే యాప్: లోకేశ్

image

AP: ఉపాధ్యాయులకు ఇప్పుడున్న 45 యాప్‌ల స్థానంలో ఒకే యాప్ తీసుకురావాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. టీచర్లు కేవలం బోధన, హాజరు, విద్యార్థుల లెర్నింగ్ సామర్థ్యాలపై ఎక్కువ సమయం కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందివ్వాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News October 20, 2025

‘డ్యూడ్’, ‘K-Ramp’ కలెక్షన్లు ఎంతంటే?

image

* ప్రదీప్, మమితా బైజు కాంబోలో వచ్చిన డ్యూడ్ మూవీ 3 రోజుల్లో రూ.66 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈనెల 17న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.22 కోట్లు, రెండో రోజు రూ.23 కోట్లు, నిన్న రూ.21 కోట్లు రాబట్టింది.
* కిరణ్ అబ్బవరం, యుక్తి జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ 2 రోజుల్లో రూ.5.1 కోట్లు(నెట్) కలెక్ట్ చేసినట్లు Sacnilk ట్రేడ్ వెబ్‌సైట్ తెలిపింది.

News October 20, 2025

బాబర్ పని అయిపోయిందా?

image

పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ పేలవ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో 16 పరుగులకే ఔటయ్యారు. బాబర్ గత 75 ఇన్నింగ్సుల్లో ఒక్క ఇంటర్నేషనల్ సెంచరీ కూడా చేయలేదు. సొంతగడ్డపై జరిగిన టెస్టుల్లోనూ దారుణంగా ఫెయిల్ అవుతున్నారు. గత 15 టెస్టు ఇన్నింగ్సుల్లో అతడి స్కోర్లు 24, 27, 0, 22, 31, 11, 30, 5, 8, 5, 1, 31, 23, 42, 16గా ఉన్నాయి. సగటు 18.40 కాగా హాఫ్ సెంచరీ కూడా బాదలేకపోయారు.

News October 20, 2025

ఇన్ఫోసిస్ ఏపీకి వెళ్లిపోతే?.. కర్ణాటక ప్రభుత్వంపై కుమారస్వామి ఫైర్

image

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కుమారస్వామి ఫైరయ్యారు. పారిశ్రామికవేత్తలతో అనుచితంగా ప్రవర్తించడం సరికాదని విమర్శించారు. ‘ఇన్ఫోసిస్ <<18031642>>నారాయణమూర్తి<<>>, సుధామూర్తి దంపతులను అవమానించేలా సీఎం సిద్దరామయ్య మాట్లాడటం దారుణం. ఒకవేళ ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను ఏపీకి మారిస్తే పరిస్థితి ఏంటి? ‘మీ అవసరం మాకు లేదు’ అన్నట్లు వ్యవహరించడం రాష్ట్రానికే నష్టం’ అని వ్యాఖ్యానించారు.