News August 16, 2024

కేసులకు భయపడను: జోగి రమేశ్

image

AP: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ మంగళగిరి PSలో విచారణకు హాజరయ్యారు. ఆ రోజు తాను కేవలం నిరసన తెలిపేందుకే చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లానని చెప్పారు. ఈ ఘటన సమయంలో వినియోగించిన కారు, ఫోన్‌ను ఆయన తీసుకొచ్చారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘కేసులకు భయపడను. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తాను. చంద్రబాబు, లోకేశ్ హామీలకు బదులు రెడ్‌బుక్ అమలు చేస్తున్నారు’ అని ఆగ్రహించారు.

Similar News

News December 10, 2025

పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

image

తెలంగాణలో రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3,800 గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. ఆయా స్కూళ్లకు ఇవాళ కూడా హాలిడే ఉంది. తర్వాత జరిగే 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13,14(ఆదివారం),16,17న కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.

News December 10, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

* యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చేసేవాళ్లు కొన్నిరోజులు అక్కినేని నాగార్జున గారిపై పరిశోధనలు చేయాలి: విజయ్ సేతుపతి
* రోషన్ కనకాల-సందీప్ రాజ్ కాంబోలో వస్తున్న ‘మోగ్లీ’ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్
* రాబోయే ఐదేళ్లలో దక్షిణాదిన రూ.12 వేల కోట్లతో కంటెంట్‌ని సృష్టించబోతున్నట్లు ప్రకటించిన జియో హాట్ స్టార్
* ‘అన్నగారు వస్తారు’ నాకో ఛాలెంజింగ్ చిత్రం: హీరో కార్తి

News December 10, 2025

చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరమంటే?

image

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.